Phule Controversy : దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లు గడిచినా ఇంకా కులం తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మనువాదాన్ని ఎదిరించి, విద్యతోనే సమాజం వికసిస్తుందని ప్రకటించిన అరుదైన మహానుభావుడు జ్యోతిబా పూలే. దేశంలోనే తొలి పాఠశాలను ప్రారంభించిన సావిత్రిబాయి పూలే జీవితాన్ని తెరకెక్కించిన చిత్రం పూలే. ప్రస్తుతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి కొన్ని సామాజిక వర్గాలు. సినిమా ప్రదర్శనకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఫిలిం కార్పొరేషన్ (సీబీఎఫ్సీ) కొన్ని మార్పులు చేయాలని సూచించింది. చిత్రానికి అనుమతి ఇవ్వకుండా కొన్ని వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Phule Controversy Viral
దీనిపై ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సీరియస్ అయ్యారు. ఆయనపై ముంబైలో కేసు నమోదైంది. ఇక సినిమా విషయానికి వస్తే పూలే చిత్రంలో మను మహారాజ్ కుల వ్యవస్థ గురించి మాట్లాడే మాటలను తొలగించాలని స్పష్టం చేసింది సినిమా సర్టిఫికేషన్ బోర్డు. పూలే చారిత్రాత్మక చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ జ్యోతిబా, సావిత్రి బాయి పూలే పాత్రలలో నటించారు.
మాంగ్’, మహర్, పేష్వై వంటి పదాలను తొలగించాలని కూడా ఆదేశించారు. చీపురు మోసే వ్యక్తి దృశ్యాన్ని సావిత్రి బాయిపై ఆవు పేడ బంతులను విసిరే బాలురుతో భర్తీ చేయాలని సూచించారు. ‘యహా 3 ఎం హై…ఔర్ హమ్ వహి కర్నే జా రహే హై అనే 43 సెకన్ల డైలాగ్ కూడా తొలగించాలని స్పష్టం చేసింది. ఈ చిత్ర నిర్మాతలు ఫూలేలో చేసిన చారిత్రక సూచనలకు మద్దతు ఇచ్చే సరైన పత్రాలను కూడా సమర్పించారు. ఇదిలా ఉండగా మరాఠాలోని బ్రాహ్మణ సమాజంలోని ఓ వర్గం ఆందోళన వ్యక్తం చేయడంతో చిత్రం వాయిదా పడింది. పూలే మూవీకి అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కుల వివక్ష, లింగ అసమానతలకు వ్యతిరేకంగా హైలెట్ చేస్తుంది.
Also Read : Beauty Megha Akash :మేఘా ఆకాష్ వెబ్ సీరీస్ లో బిజీ