మే 21న విశాఖలో యోగా డే.. హాజ‌రుకానున్న ప్ర‌ధాని

పాల్గొంటారని ప్ర‌క‌టించిన సీఎం

అమ‌రావ‌తి – అంత‌ర్జాతీయ యోగా డే సంద‌ర్బంగా ఈసారి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఏపీని ఎంచుకున్నారు. ఆయ‌న వ‌చ్చాక యోగాకు అధిక ప్రాధాన్య‌త ల‌భించింది. పతంజ‌లి వ్య‌వ‌స్థాప‌కులు యోగా గురు రామ్ దేవ్ బాబా , ర‌వి శంక‌ర్, జ‌గ్గీ వాసుదేవ‌న్ లాంటి వాళ్లు లైమ్ లైట్ లోకి వ‌చ్చారు. ఒక ర‌కంగా త‌మంత‌కు తాముగా మార్కెటింగ్ చేసుకున్నారు. వారికి ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని సౌక‌ర్యాలు ల‌భించాయి. ఇదే స‌మ‌యంలో యోగా డేను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఏపీ స‌ర్కార్.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ముఖ్య అతిథిగా ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో మే21న జ‌రిగే ప్ర‌పంచ యోగా డే కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతార‌ని వెల్ల‌డించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇందుకు సంబంధించి కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు చీఫ్ సెక్ర‌ట‌రీని. ఎక్క‌డా లోటు పాట్లు లేకుండా చూడాల‌ని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21 నుంచి వ‌చ్చే నెల జూన్ 21 వ‌ర‌కు నెల రోజుల పాటు యోగా మంత్ ను పాటించాల‌ని స్ప‌ష్టం చేశారు.

అంతే కాకుండా ప్ర‌తి గ్రామం, ప‌ట్ట‌ణంలో యోగా ఉత్స‌వాలు నిర్వ‌హించాల‌న్నారు. ఈ నిర్వ‌హ‌ణ గురించి జాగ్ర‌త్త‌గా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు సీఎం. అంతేకాకుండా నెల రోజుల పాటు యోగా ను ప్రాక్టీస్ చేసిన వారికి స‌ర్టిఫికెట్స్ ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు. విశాఖ‌లో ల‌క్ష‌లాది మందితో పాటు ప్ర‌ధాని యోగాస‌నాలు వేస్తార‌న్నారు. ఆర్కే బీచ్ మొత్తం యోగాసానాల‌తో నిండి పోవాల‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com