బంగ్లాదేశ్ కు షాకిచ్చిన భార‌త్

స‌ర‌కుల ర‌వాణాపై నిషేధం

ఢిల్లీ – అటు పాకిస్తాన్ ఇటు చైనా, ట‌ర్కీతో జ‌త క‌ట్టిన బంగ్లాదేశ్ కావాల‌ని భార‌త్ తో క‌య్యానికి కాలు దువ్వుతోంది. దీంతో ఇప్ప‌టికే ఆప‌రేష‌న్ సిందూర్ మిష‌న్ తో పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించిన భార‌త్ ఉన్న‌ట్టుండి మ‌రో బిగ్ షాక్ ఇచ్చింది బంగ్లాకు. ఇప్ప‌టికే మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రైనా లేదా ఏ దేశ‌మైనా భార‌త్ వైపు క‌న్నెత్తి చూస్తే క‌ళ్లు పీకేస్తామ‌ని, ఉగ్ర‌వాదులు ఎక్క‌డ ఉన్నా వెతికి ప‌ట్టుకుని తీరుతామ‌ని , భూమి మీద లేకుండా చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

తాజాగా భార‌త దేశంలోని ఈశాన్య రాష్ట్రాల నుంచి దిగుమ‌తి చేసుకునే స‌ర‌కులుపై ఆంక్ష‌లు విధించింది ఆ దేశం. దీనికి గ‌ట్టిగా సమాధానం ఇచ్చింది. బంగ్లా నుంచి దిగుమ‌తి చేసుకునే వ‌స్తువుల‌పై బ్యాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదే స‌మ‌యంలో అమెరికా దేశానికి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. త‌మ దేశ సార్వ‌భౌమ‌త్వం విష‌యంలో జోక్యం చేసుకుంటే స‌హించేది లేద‌ని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. తాను మ‌ద్ద‌తుగా నిలిచాన‌ని, కాని మ‌ధ్య‌వ‌ర్తిత్వం ఇవ్వ‌లేదంటూ బుకాయించే ప్ర‌య‌త్నం చేశాడు.

ఏది ఏమైనా ఇప్పుడు భార‌త్ త‌న స‌త్తా ఏమిటో , ఏపాటిదో యావ‌త్ ప్ర‌పంచానికి తెలియ చేసింది ఆప‌రేష‌న్ సిందూర్ తో. భార‌త్ త్రివిధ ద‌ళాల దెబ్బ‌కు పాకిస్తాన్ విల విలాడింది. దాని గొంతు నొక్కేసింది. విచిత్రం ఏమిటంటే ఆ దేశ ప్ర‌ధాని షెహ‌బాజ్ సైతం బ‌హిరంగంగా ఒప్పుకున్నాడు త‌మ దేశంలోని ఎయిర్ బేస్ ల‌పై భార‌త్ దాడి నిజ‌మేన‌ని.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com