20న విశాఖ‌కు రానున్న ప్ర‌ధాని మోదీ

భారీ ఎత్తున ఏపీ ప్ర‌భుత్వం ఏర్పాట్లు

ఢిల్లీ – కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈనెల 21న ప్ర‌పంచ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ 20వ తేదీన విశాఖ‌ప‌ట్నంకు చేరుకుంటార‌ని తెలిపింది. ఆరోజు భువ‌నేశ్వ‌ర్ లో ప‌ర్య‌టిస్తార‌ని అక్క‌డి నేరుగా విశాఖ‌కు చేరుకుని తూర్పు నౌకాద‌ళ గెస్ట్ హౌస్ లో బ‌స చేస్తార‌ని పేర్కొంది. యోగా డే సంద‌ర్బంగా ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించే యోగా డే ర్యాలీలో పాల్గొంటార‌ర‌ని వెల్ల‌డించింది. యోగా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం ఢిల్లీకి వెళ‌తార‌ని స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం. భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే వెల్ల‌డించారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. మోడీ టూర్ ను పుర‌స్క‌రించుకుని ఎలాంటి లోపాలు లేకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు త‌న సార‌థ్యంలో విశాఖ‌లో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేశారు. దేశంలో , ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా 5 ల‌క్ష‌ల మందితో యోగా డే ర్యాలీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

యోగా డే సంద‌ర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేష‌న్ చేసుకున్నార‌ని ప్ర‌క‌టించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇది ఓ రికార్డ్ అని పేర్కొన్నారు. యోగా డే అనేది ప్ర‌పంచంలో రికార్డు న‌మోదు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రైనా వ‌రుస‌గా మూడు రోజుల పాటు యోగాలో పాల్గొంటే వారికి ప్ర‌భుత్వం త‌ర‌పున యోగా డే స‌ర్టిఫికెట్ అంద‌జేస్తామ‌న్నారు సీఎం.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com