సీవీ ఆనంద్ కు పుర‌స్కారం పోలీసుల‌కు గౌర‌వం

దుబాయ్ వేదిక‌గా అవార్డు అందుకున్న పోలీస్ క‌మిష‌న‌ర్

దుబాయ్ – దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పోలీస్ శాఖా ప‌రంగా నేరాలు, మాద‌క ద్ర‌వ్యాల‌ను నియంత్రించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు అరుదైన పుర‌స్కారం ల‌భించింది. అవార్డును స్వీకరించిన అనంత‌రం సీపీ సీవీ ఆనంద్ ప్ర‌సంగించారు. 138 దేశాల నుండి పోలీసు అధికారులు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారని, హైదరాబాద్ నగర పోలీసుల విజయం పట్ల అపారమైన గర్వం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

ప్రపంచ పోటీ మధ్య ఈ అవార్డు గెలుచు కోవడం మాదక ద్రవ్యాల అమలులో H-NEW సామర్థ్యం, ​​అంకితభావం, వినూత్న పద్ధతులను ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ గుర్తింపు తెలంగాణ పోలీసులకు గౌరవం మాత్రమే కాదు, మొత్తం భారత పోలీసు దళానికి గర్వకారణమైన క్షణం అన్నారు. మా బృందం చేసిన‌ అవిశ్రాంత ప్రయత్నాలు, ఆధునిక పద్ధతులు, మాదకద్రవ్యాల ముప్పును నిర్మూలించడానికి ప్రజలపై దృష్టి సారించిన విధానానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు సీవీ ఆనంద్.

ఈ సమ్మిట్ సందర్భంగా 12 దేశాలలోని చట్ట అమలు సంస్థల నుండి పన్నెండు మంది అధికారులు ,ఆవిష్కర్తలు వివిధ విభాగాలలో అత్యున్నత గౌరవాలతో గుర్తించబడ్డారు. అంతకుముందు, సమ్మిట్‌లో జరిగిన ప్యానెల్ చర్చలో ఆనంద్ పాల్గొన్నారు. భారతదేశంలో, ముఖ్యంగా కోవిడ్ తర్వాత మాదక ద్రవ్యాల పెరుగుతున్న సవాళ్లను ప్రస్తావించారు. మాదక ద్రవ్యాల సిండికేట్‌లు ఉపయోగించే కొత్త మార్గాలు , పద్ధతులు, పెడ్లర్లు , ముఠాలపై విజయవంతమైన అణిచివేతలు, విద్యా సంస్థలలో మాదకద్రవ్యాల వ్యతిరేక కమిటీలు, అవగాహన డ్రైవ్‌లు, తన నాయకత్వంలో చేపడుతున్న పునరావాస ప్రయత్నాల వంటి చొరవలను సీపీ వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com