అమరావతి – మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. తనకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇతర దేశాలకు వెళ్లకుండా ఉండేందుకు ఈ నోటీసు జారీ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే తను తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. తొలుత హైదరాబాద్ లో చికిత్స చేయించుకున్నారు. తన గుండెకు రంధ్రం పడినట్లు తేలడంతో ముంబై ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. మరింత మెరుగైన చికిత్స కోసం అమెరికాకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన సహచరులకు ఈ సమచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఉన్నట్టుండి కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేష్ , భార్య భువనేశ్వరి, కోడలితో పాటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను అమ్మనా బూతులు తిట్టాడు. అనరాని మాటలు అన్నాడు. కానీ కాలం విచిత్రమైనది కదూ. ఏపీలో పవర్ మారింది. కూటమి సర్కార్ కొలువు తీరింది. లోకేష్ ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు తమను ఇబ్బంది పెట్టిన వారిని వదిలి పెట్టబోమంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సమయంలో రెబ్ బుక్ లో పేర్లు రాసుకుంటానని ప్రకటించాడు.
ఆయన చెప్పినట్టుగానే వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు. మరో వైపు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుర్తు పట్టని రీతిలో తయారయ్యాడు. తనను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మొత్తంగా బొమ్మ కనిపించేలా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు సైలెంట్ గా.