Pooja Hegde : బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు వేరు సోషల్ మీడియాలో ఫాలోవర్లు వేరు అని పేర్కొన్నారు. తను నటించిన రెట్రో మూవీ ప్రమోషన్స్ సందర్బంగా చిట్ చాట్ చేసింది ఈ అమ్మడు. తనకు కూడా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారని, అయినా వారంతా సినిమాను చూసేందుకు వస్తారని తాను అనుకోవడం లేదన్నారు. ఇన్ స్టా లో తనకు 27 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారని చెప్పారు. కానీ వారంతా తన సినిమాలు చూసేందుకు టాకీసుల్లోకి వస్తారని తాను అనుకోవడం లేదన్నారు.
Pooja Hegde Shocking Comments
చాలా మందికి సూపర్ స్టార్లకు 5 మిలియన్ల కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉంటారు.. కానీ వాళ్ల సినిమాలకు కోట్ల మంది వస్తుంటారని చెప్పారు పూజా హెగ్డే(Pooja Hegde). మూవీ సక్సెస్ కావాలంటే ఒక్కటే సూత్రం. కథలో దమ్ముండాలి. దర్శకుడి పనితీరు ఆధారంగా విజయం ఆధారపడి ఉంటుందన్నారు. తను నటించిన మూవీస్ ఈ మధ్య ఆశించినంత ఆడలేదు. గతంలో అటు తమిళంలో ఇటు టాలీవుడ్ లో సెన్సేషన్ గా నిలిచింది. ఆమె వరుసగా స్టార్ హీరోలతో నటించింది. మెప్పించింది. లక్షలాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
తమిళంలో దళపతి విజయ్ తో నటించింది. ఆ మూవీ బిగ్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథంలో నటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో మెప్పించింది. మహేష్ బాబుతో తెర పంచుకుంది. డార్లింగ్ ప్రభాస్ తో జత కట్టింది. బాలీవుడ్ సూపర్ హీరో సల్మాన్ ఖాన్ తో , యువ మీరో షాహీద్ కపూర్ తో రెచ్చి పోయింది. ప్రస్తుతం తమిళంలో రెట్రో మూవీతో ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తను చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Sarangapani Jathakam Sensational :సారంగపాణి జాతకం మరో పుష్పక విమానం