ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు తీపి కబురు చెప్పాడు దర్శకుడు మారుతి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో భారీ అంచనాల మధ్య దీనిని తీసే పనిలో పడ్డాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఎప్పుడో రావాల్సి ఉంది టీజర్. ఇప్పటి వరకు 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని వెల్లడించాడు ఈ మధ్యనే దర్శకుడు. తనకు మినిమం గ్యారెంటీ అని పేరుంది. రెబల్ స్టార్ కీ రోల్ పోషించాడు. ఇందులో తనకు జతగా మలయాళ సినీ స్టార్ మాళవిక మోహన్ నటించింది. దీనిపై పూర్తి నమ్మకంతో ఉంది. తనకు ఫీల్ గుడ్ అనిపించేలా చేసింది.
ఇది పక్కన పెడితే మాస్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు పొందిన ఎస్ఎస్ థమన్ రాజా సాబ్ కు సంగీతం కూర్చాడు. పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీపై. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ కు భారీ ఎత్తున స్పందన లభించింది. వస్తోంది కూడా. తనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా. ఇదిలా ఉండగా తాజాగా కీలక అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు మారుతి. ఈ మేరకు తేదీ, టైం కూడా ఫిక్స్ చేశారు.
ఈనెల 16న సోమవారం ఉదయం 10.52 గంటలకు గ్రాండ్ గా రాజా సాబ్ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు డైరెక్టర్. టీజర్ అద్భుతంగా ఉంటుందని హామీ ఇస్తున్నానని అన్నాడు. ఈ చిత్రంలో మాళవికతో పాటు నిధి అగర్వాల్ కూడా కీ రోల్ పోషిస్తోంది. ఈ మూవీని పూర్తిగా రొమాంటిక్, సస్పెన్స్, థ్రిల్లర్ గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు.