Nayanthara : నటుడు సంతోష్ శివన్ ను పెళ్లి చేసుకుని ఇద్దరి కవల పిల్లలకు జన్మనిచ్చిన ప్రముఖ నటి, తమిళ లేడీ అమితాబ్ గా పేరు పొందిన నయన తారపై సంచలన వ్యాఖ్యలు చేసింది కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మొదటి భార్య లత. తను అందంగా , హాయిగా ఉన్న కాపురంలో చిచ్చు పెట్టిందని ఆవేదన చెందింది. తన కళ్లు మంచివి కావంటూ పేర్కొంది. ఇదిలా ఉండగా సినీ కెరీర్ లో నయనతార పలువురితో ప్రేమాయణం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. శింబు, ప్రభుదేవాతో క్లోజ్ గా ఉన్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
Nayanthara Got Shocking
అయితే పెళ్లి చేసుకున్నాక నయనతార(Nayanthara), విఘ్నేష్ శివన్ లు అందమైన కపుల్స్ గా గుర్తింపు పొందారు. ఇదిలా ఉండగా ప్రభుదేవా, నయన్ లు కెరీర్ పరంగా పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో 2010 సెప్టెంబర్ లో తాను నయన్ ప్రేమలో పడ్డానని, పీకల లోతు కూరుకు పోయానని ప్రకటించాడు కొరియోగ్రాఫర్. దీంతో యావత్ సినీ లోకం ఒక్కసారిగా విస్తు పోయింది. తనను పెళ్లి చేసుకోవాలనే కోరికను కూడా వెల్లడించాడు ప్రభుదేవా. ఇదే సమయంలో తనతో బంధం కొనసాగించాలంటే మొదటి భార్య లతకు విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే తమను దూరం అయ్యేలా చేసిందని కన్నీటి పర్యంతం అయ్యింది లత.
ఓ మూవీ ఛానల్ తో లత చిట్ చాట్ చేసింది. ఈ సందర్బంగా నయనతారను ఏకి పారేసింది. సంచలన ఆరోపణలు చేసింది. తనపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. తమ వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు నయనతార ప్రయత్నం చేసిందని ఆరోపించింది. ప్రభుదేవా నిజాయితీ కలిగిన, దయ ఉన్న వ్యక్తి అని చెప్పింది. గత 15 ఏళ్లుగా తమను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని తెలిపింది. ప్రస్తుతం తన ప్రవర్తన పూర్తిగా మారి పోయిందని వాపోయింది. ఇదిలా ఉండగా 2010 జూన్ లో లత, ప్రభు దేవాకు విడాకులు మంజూరు చేయబడ్డాయి. ఆ తర్వాత నయన్ తో పెళ్లి చేసుకోలేక పోయాడు.
Also Read : Hero Mohanlal – Thudarum :కాసుల వర్షం తుడారుమ్ సంచలనం