ప్రీతి జింతా ఔదార్యం ఆర్మీకి భారీ విరాళం

కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ కింద సాయం

ప్ర‌ముఖ న‌టి, పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టు ఓన‌ర్ ప్రీతి జింతా త‌న ఔదార్యాన్ని చాటుకున్నారు. రేయింబ‌వ‌ళ్లు దేశ భ‌ద్ర‌త కోసం శ్ర‌మిస్తున్న భార‌త జ‌వాన్ల కోసం భారీ విరాళాన్ని ప్ర‌క‌టించారు. త‌ను హిందీ మూవీస్ తో పాటు తెలుగులో కూడా న‌టించింది. త‌న‌కు వేలాది మంది అభిమానులు ఉన్నారు. ఓన‌ర్ గా , న‌టిగా పై స్థాయిలో ఉన్నా ఆమెకు ఎలాంటి అర‌మ‌రిక‌లు లేవు. భేష‌జాల‌కు దూరంగా ఉంటారు. ప్ర‌తి ఒక్క‌రినీ ప‌ల‌క‌రిస్తారు ఆప్యాయంగా. ఇంకొక‌రైతే ప‌ట్టించుకోరు.

ఐపీఎల్ సంద‌ర్బంగా త‌ను వైర‌ల్ గా మారారు. మంచి ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన ఆట‌గాళ్ల‌ను ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చెందిన వారైనా స‌రే త‌నే వెళ్లి ప‌ల‌క‌రించ‌డం, వారిని వెన్ను త‌ట్టి ప్రోత్స‌హించ‌డం చేస్తూ వ‌స్తున్నారు. కానీ ఈ మ‌ధ్య‌న ఫేక్ ఫోటోలు, వీడియోలు త‌న గురించి ప్ర‌చారం కావ‌డం ప‌ట్ల స్పందించారు తీవ్రంగా ప్రీతి జింతా. విచిత్రం ఏమిటంటే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ లో ఎంపికైన 14 ఏళ్ల కుర్రాడు వైభ‌వ్ సూర్య వంశీతో క‌ర‌చాల‌నం చేస్తే దానికి భిన్నంగా త‌ను ఆలింగ‌నం (హ‌గ్ ) చేసుకున్న‌ట్లు ఫోటోలు షేర్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆపై ఖండించింది కూడా.

ఇలాంటివి మంచి ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికింది. ఇదే స‌మ‌యంలో కేంద్ర స‌ర్కార్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ స‌క్సెస్ అయినా ప‌లువురు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళులు అర్పించింది ప్రీతి జింతా. అంతే కాదు భార‌త భ‌ద్ర‌తా ద‌ళాల కోసం కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ. 1.10 కోట్లు ప్ర‌క‌టించింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com