వైభ‌వ్ తో క‌ర‌చాల‌నం ఆలింగ‌నం అబ‌ద్దం

మార్ఫింగ్ ఫోటోలు, వీడియోపై ప్రీతి జింతా

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి ప్రీతి జింతా సంచ‌ల‌నంగా మారారు. త‌ను ప్ర‌స్తుతం ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో సెంటర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. దీనికి కార‌ణం ఐపీఎల్ లో ముగ్గురు ముద్దు గుమ్మ‌లు హ‌ల్ చ‌ల్ చేశారు. వారిలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓన‌ర్ , సీఈవో కావ్య మార‌న్ , కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కో ఓన‌ర్ జూహ్లీ చావ్లా కాగా మ‌రొక‌రు పంజాబ్ టీం ఓన‌ర్ ప్రీతి జింతా.

అయితే టోర్నీ ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది. మొత్తం 10 జ‌ట్ల‌లో ఆరు జ‌ట్లు టోర్నీ నుంచి నిష్క్ర‌మించాయి. వాటిలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్లు ఉన్నాయి. ఇక టోర్నీలో అందాల సుంద‌రి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్రీతి జింతా ఒక్క‌తే మిగిలి పోయింది. ఈ అమ్మ‌డు ఇప్పుడు ఏది చేసినా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతోంది. మాట్లాడినా లేదా క‌ర‌చాల‌నం చేసినా లేదా ఆలింగ‌నం చేసుకున్నా వెంట‌నే కెమెరాలు, ఫోన్లు క్లిక్ మ‌నిపిస్తున్నాయి.

ఈ త‌రుణంలో టోర్నీలో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో బీహార్ కుర్రాడు అభిన‌వ్ సూర్య వంశీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ తో జ‌రిగిన మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కేవ‌లం 10 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. మ్యాచ్ అనంత‌రం టోర్నీలో దుమ్ము రేపి, ప‌రుగుల వ‌ర‌ద పారించిన ఈ 14 ఏళ్ల కుర్రాడితో షేక్ హ్యాండ్ ఇచ్చింది. అయితే కొంద‌రు త‌న‌ను హ‌గ్ చేసుకున్న‌ట్లు ఫోటోల‌ను మార్ఫింగ్ చేశారు. ఆ ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేశాయి. దీంతో గ‌త్యంత‌రం లేక ప్రీతి జింతా స్పందించింది. తాను క‌ర‌చాల‌నం చేశాన‌ని ఆలింగ‌నం చేసుకోలేదంటూ చెప్పేసింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com