పవన్ సినిమాను ఆపే దమ్ము ఎవ‌రికీ లేదు

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు కామెంట్స్

హైద‌రాబాద్ – తెలంగాణ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ (టీఎఫ్డీసీ) చైర్మ‌న్, ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్ని రోజులుగా జూన్ 1 నుంచి ఏపీ, తెలంగాణ‌లో థియేట‌ర్లు బంద్ అవుతున్నాయంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై ఇప్ప‌టికే మ‌రో నిర్మాత‌, పాన్ ఇండియ‌న్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత దిల్ రాజు స్పందించారు.

న‌లుగురు నిర్మాత‌లు కూర్చుని స‌మావేశం పెట్టుకున్నార‌ని అన్నారు. ఆ న‌లుగురిలో తాను లేన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. సినీ ఇండ‌స్ట్రీ బాగు ప‌డాలంటే ఏపీ ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త‌తో మెల‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కానీ ఎందుక‌నో కొంద‌రు సినీ పెద్ద‌లు అంత దాకా వెళ్ల లేక పోయార‌ని పేర్కొన్నారు .

దీనిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు దిల్ రాజు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. త‌న‌కు కోపం వ‌స్తే తిడతార‌ని, ఆయ‌న ఎన్ని తిట్టినా ప‌డ‌తామన్నారు దిల్ రాజు. ఆయ‌న‌కు త‌మ‌ను అనే హ‌క్కు ఉంద‌న్నారు. ప‌వ‌ర్ స్టార్ హ‌ర్ట్ అయితే త‌మ‌ను తిట్టే అధికారం త‌ప్ప‌కుండా త‌న‌కు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే సినీ ఇండ‌స్ట్రీ గురించి కూడా స్పందించారు దిల్ రాజు. ఈ రంగంలో ఎవ‌రి దారి వారిదేన‌ని అన్నారు.

స‌మ‌స్య‌ల‌పై అంద‌రం కూర్చుని మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మొన్న అల్లు అర‌వింద్ ఇవాళ తాను ముందుకు వ‌చ్చాన‌ని చెప్పారు. ఏప్రిల్ 19న తూర్పు గోదావరి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారని తెలిపారు. పర్సెంటేజ్ విధానం ఉంటే బాగుంటుందంటూ చ‌ర్చించార‌న్నారు. కొన్ని సినిమాలు మాత్రమే రెంట్ లేదా పర్సెంటేజ్ విధానంలో ఆడుతున్నాయని వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించిన తలెత్తిన సమస్యలపై సరైన పరిష్కారం దొరకడం లేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com