సినిమా రంగం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. ఆయన తాజాగా థియేటర్లు బంద్ చేయాలన్న డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయంపై ఆరా తీయడం, ఆపై సంచలన వ్యాఖ్యలు చేయడం , అవి కలకలం రేపడం జరిగాయి. దీంతో ఒక్కసారిగా ప్రముఖ నిర్మాతలు స్పందించారు. వారిలో మొదటగా అల్లు అరవింద్ స్పందించాడు. నలుగురు నిర్మాతలు ఒక చోట కూర్చున్నారని, వారికి మద్దతుగా తాను లేనని పేర్కొన్నారు.
ఆ తర్వాత తెలంగాణ ఫిలిం చాంబర్ లో డిస్ట్రిబ్యూటర్ల, ఎగ్జిబిటర్స్ , నిర్మాతలు కీలక సమావేశం నిర్వహించడం , జూన్ 1 నుంచి టాకీసులు బంద్ చేస్తామని ప్రకటించడం జరిగింది. దీనిపై భగ్గుమన్నారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్. ఇది కావాలని పన్నిన కుట్రగా అభివర్ణించారు. దీని వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరో తేల్చాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్బంగా కీలక భేటీ జరిగింది. దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.
పలు సూచనలు చేశారు. ప్రధానంగా థియేటర్లలో కొందరి గుత్తాధిపత్యం ఎందుకు ఉందంటూ ప్రశ్నించారు. వాటిపై నిఘా పెట్టాలని, నియంత్రించాలని స్పష్టం చేశారు. లేక పోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా సరే ప్రభుత్వంతో చర్చించాలంటే తెలుగు ఫిలిం చాంబర్ ద్వారానే రావాలని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. తను కీలక ప్రతిపాదనలు చేశారు. దీనిపై స్పందించారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. తాను చేసిన ప్రతిపాదనల గురించి తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు.