కొడుకు గ్రాడ్యుయేష‌న్ వేడుక‌లో ధ‌నుష్..ఐశ్వ‌ర్య

విడిపోయిన త‌ర్వాత చాన్నాళ్ల‌కు ఒక్క‌ట‌య్యారు

కొన్ని స‌న్నివేశాలు గుర్తుండి పోయేలా చేస్తాయి. త‌మిళ సినీ రంగానికి చెందిన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న‌యురాలు, నిర్మాత ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ హాట్ టాపిక్ గా మారారు. గ‌తంలో ప్ర‌ముఖ న‌టుడు ధ‌నుష్ తో త‌ను పెళ్లి అయ్యింది. కొంత కాలం పాటు బాగానే ఉన్నారు. కానీ ఏమైందో ఏమో కానీ తామిద్ద‌రం విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు ధ‌నుష్, ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్. ఈ ఇద్ద‌రికి ముద్దుల కొడుకు ఉన్నాడు. త‌ను ఇప్పుడు చ‌దువుకుంటున్నాడు.

ఈ సంద‌ర్బంగా కొడుకు గ్రాడ్యుయేష‌న్ డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. విడి పోయిన భార్య భ‌ర్త‌లు వ‌స్తారా రారా అన్న ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ఇద్ద‌రు చాన్నాళ్ల త‌ర్వాత క‌లుసు కోవ‌డం, ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ అయ్యేలా చేశాయి. ధ‌నుష్ ప్ర‌స్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. అక్కినేని నాగార్జునతో క‌లిసి సినిమాలో న‌టించాడు. ఇక ఐశ్వ‌ర్య‌, ధ‌నుష్ ల‌కు విడాకులు గ‌త ఏడాది న‌వంబ‌ర్ లో ఖ‌రార‌య్యాయి.

పెద్ద కొడుకు గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసుకోవ‌డం ప‌ట్ల ఆనందంగా ఉందంటూ పేర్కొన్నాడు ధ‌నుష్. తానే స్వ‌యంగా ఫోటోను ఇన్ స్టా ద్వారా షేర్ చేశాడు. ఈ ఇద్ద‌రూ త‌మ కొడుకును ఆలింగ‌నం చేసుకున్నారు. త‌న‌ను అభినందించారు. ఈ ఇద్ద‌రూ 2004లో పెళ్లి చేసుకున్నారు. లింగా, యాత్ర అనే ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు. 18 ఏళ్ల త‌ర్వాత క‌లుసు కోవ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశాడు ధ‌నుష్.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com