టైటిల్స్ ను ఆకట్టుకునేలా, సర్ ప్రైజ్ చేసేలా పెట్టడంలో తనకు లేరు ఎవరు సాటి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు పూరీ జగన్నాథ్. ఒకప్పుడు టాప్ లో కొనసాగాడు . ఇప్పుడు సినిమాలపై ఫోకస్ పెట్టాడు. సక్సెస్, ఫెయిల్యూర్ తో పని లేకుండా మూవీస్ తీసుకుంటూ పోతున్నాడు. ఆ మధ్యన విజయ్ దేవరకొండతో లైగర్ తీశాడు. అది బోల్తా కొట్టింది. ఆ తర్వాత రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ తీశాడు. సూపర్ హిట్ అయ్యింది. దీని ద్వారా డబ్బులు రావడంతో సీక్వెల్ తీశాడు అది దొబ్బింది. మూస ధోరణికి అలవాటు పడడంతో ప్రేక్షకులు ఆదరించడం మానేశారు. దీనిని గుర్తించడం లేదు పూరీ జగన్నాథ్.
ఫెయిల్యూర్స్ వచ్చినా తనకు మంచి ఆఫర్ వచ్చింది. తమిళ సినీ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తనతో మూవీ చేసేందుకు. ఈ మేరకు హీరోయిన్లు కూడా ఖరారైనట్లు టాక్. బాలీవుడ్ కు చెందిన టబుతో పాటు మాలీవుడ్ కు చెందిన నివేదితా థామస్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక మరో పాత్రకు శాండిల్ వుడ్ కు చెందిన విజయ్ ని ఖరారు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇది పక్కన పెడితే తాను తీయబోయే సినిమాకు సంబంధించిన టైటిల్స్ ను ఇప్పటికే రిజిస్టర్ చేశాడు. ఒకటి బెగ్గర్ కాగా మరోటి భవతి భిక్షాందేహి. ఇందుకు సంబంధించిన పోస్టర్స్ కూడా వైరల్ గా మారాయి. అయితే ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ కాలేదు. మొత్తంగా ఏది పెట్టినా ఆ టైటిల్ కెవ్వుకేక అనిపించేలా ఉంటుందనడంలో సందేహం లేదు.