హైదరాబాద్ – సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ వివాదాస్పదంగా మారింది. చేవెళ్ల పోలీసులు జరిపిన దాడుల్లో విస్తు పోయే దృశ్యాలు కంటబడ్డాయి. అంతే కాదు పెద్ద ఎత్తున గంజాయి, విదేశీ మద్యం పట్టుబడింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఇందులో ఉన్నారని తేలింది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరెవరు ఉన్నారనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. చాలా మందికి డ్రగ్స్ టెస్టులు చేశామన్నారు డీసీపీ శ్రీనివాస్. ఒక్క దామోదర్ రెడ్డికి తప్పా అందరికీ నెగటివ్ వచ్చిందన్నారు. ఈ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మకు దగ్గరి వాడంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఇది పక్కన పెడితే యాంకర్ గా, తెలంగాణ జానపద పాటలకు, సినీ గేయాలకు ప్రసిద్ది పొందింది మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్.
తన స్వస్థలం రాయలసీమ. ఆ తర్వాత వైసీపీ హయాంలో ప్రచారం చేసింది. తనకు గిఫ్ట్ గా జగన్ రెడ్డి ఈ మాటకారి మంగ్లీని తీసుకు పోయి ఎస్వీబీసీ ఛానల్ కు చైర్ పర్సన్ గా చేశాడు. ఇలా తయారైంది వ్యవస్థ. సినిమాలలో తను పాడిన పాటలు జనాదరణ పొందాయి. ఆ తర్వాత తనకు స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఇక అహంకారం పెరిగింది. తాను ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణితో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున గంజాయి, ఫారిన్ లిక్కర్ పోలీసుల సోదాల్లో బయట పడింది.
ఈ పార్టీలో ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ కూడా ఉన్నాడు. అందరూ తాగుతూ ఊగుతూ కనిపించారు. ఈ సందర్బంగా జబర్దస్త్ ఫేమ్ రచ్చ రవి కూడా ఉన్నాడని పేరు బయటకు వచ్చింది. దీనిపై రచ్చ రవి స్పందించాడు. అయ్యో తాను అమాయకుడినని, తనకు ఏ పాపం తెలియదంటూ పేర్కొన్నాడు. తనను అనవసరంగా వివాదాల్లోకి లాగవద్దని కోరాడు.