సినీ ఇండస్ట్రీలో పని చేసే తల్లుల (హీరోయిన్ల) కు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రముఖ నటి రాధికా ఆప్టే. తాజాగా ప్రముఖ దర్శకుడు వంగా సందీప్ రెడ్డి , దీపికా పదుకొనే మధ్య చోటు చేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి పోయింది. ఇరువరు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. సామాజిక వేదికల ద్వారా మాటల యుద్దం కొనసాగించారు. ఇంకా ఈ కాంట్రవర్సీకి తెర పడలేదు.
తను యానిమల్ మూవీ బిగ్ సక్సెస్ తర్వాత వంగా సందీప్ రెడ్డి లైమ్ లైట్ లోకి వచ్చాడు. అంతకు ముందు ఆయన అర్జున్ రెడ్డి మూవీ తీశాడు. ఇది బిగ్ హిట్. దీనిని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో తీశాడు. ఇక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత రణ బీర్ కపూర్ , అనిల్ కపూర్, బాబీ డియోల్ , రష్మిక మందన్నాతో తీసిన యానిమల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 1000 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ ను షేక్ చేసింది.
పాన్ ఇండియా ప్రభాస్ తో తాను స్పిరిట్ మూవీ తీస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాలో ముందుగా దీపికా పదుకొనేను తీసుకోవాలని అనుకున్నాడు. తను రూ. 20 కోట్లు డిమాండ్ చేయడంతో సైడ్ చేశాడు. ఆమె స్థానంలో రూ. 4 కోట్లకు యానిమల్ లో నటనతో ఆకట్టుకున్న త్రుప్తి దిమ్రీని ఎంపిక చేశాడు ప్రభాస్ తో. దీనిపై తీవ్రంగా స్పందించింది దీపికా పదుకొనే.
తన నవజాత కుమార్తెతో సమయం గడపడానికి సెట్లో 8 గంటల పని దినం అనేది ఆమె ప్రధాన షరతులలో ఒకటి. అయితే, నిర్మాణ బృందం ఆమె డిమాండ్లను తీర్చలేక పోయింది . ఈ మొత్తం విషయం పని చేసే తల్లుల పట్ల చిత్ర పరిశ్రమ వైఖరిని వెలుగులోకి తెచ్చింది. పని చేసే తల్లుల పట్ల చిత్ర పరిశ్రమ మద్దతు ఇవ్వలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రముఖ నటి రాధికా ఆప్టే.