కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కు ఆపరేషన్ సిందూర్ మిషన్ గురించి ముందే లీక్ ఇచ్చారంటూ ఆరోపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రాహుల్ గాంధీ కావాలని భారత దేశం పట్ల దురుద్దేశ పూర్వకంగా బద్నాం చేసే పనిలో పడ్డారంటూ ఆరోపించింది కేంద్రం. దీనిని తీవ్రంగా ఖండించింది భారతీయ జనతా పార్టీ. ఇది మంచి పద్దతి కాదని సూచించింది. పహల్గామ్ దాడిలో 26 మంది పర్యాటకులు చని పోయిన తర్వాత కూడా రాహుల్ గాంధీ ఇలా దిగజారి మాట్లాడటం తమను విస్తు పోయేలా చేసిందని పేర్కొంది.
ఒక బాధ్యత కలిగిన పార్టీకి నాయకుడిగా ఉన్న తను ఇలాంటి కామెంట్స్ చేయడం తన వ్యక్తిత్వానికి ఏమాత్రం సరి పోదని స్పష్టం చేసింది. ఓ వైపు యావత్ భారతమంతా మోదీ తీసుకున్న నిర్ణయం, విదేశాంగ విధానం, ఆపరేషన్ సక్సెస్, భారత త్రివిధ దళాల పోరాట పటిమ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని, ఈ మేరకు దేశ మంతటా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారని అన్నారు. కానీ ఇవేవీ రాహుల్ గాంధీకి కనిపించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. మొత్తంగా రాహుల్ గాంధీ తను పూర్తిగా దేశ వ్యతిరేకి అని ఈ కామెంట్స్ తో అర్థమై పోయిందన్నారు.