ట్రైల‌ర్ రిలీజ్ కాకుండానే సీన్స్ రిలీజ్

రాజా సాబ్ మూవీ మేక‌ర్స్ స్ట్రాంగ్ వార్నింగ్

భారీ ఖ‌ర్చుతో తీస్తున్న సినిమాల‌కు సంబంధించి పైర‌సీ బెడ‌ద తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది. తాజాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మాణ సంస్థ డార్లింగ్ ప్ర‌భాస్ , మాళ‌విక మోహ‌న్ తో రాజా సాబ్ సినిమా తీస్తున్నారు. దీనికి భలే భ‌లే మ‌గాడివోయ్ ఫేమ్ డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించి దాదాపు 90 శాతం షూటింగ్ పూర్త‌యింది. స‌మ్మ‌ర్ వెకేష‌న్ త‌ర్వాత ఇట‌లీ నుంచి సిటీకి వ‌చ్చాడు న‌టుడు డార్లింగ్.

ఈ మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. ఈ మేర‌కు ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు తీపిక‌బురు చెప్పాడు. రాజా సాబ్ పై ఆగ్ర‌హంతో ఉన్న అభిమానుల‌కు సంతోషం క‌లిగించేలా ఈ నెల‌లోనే రాజా సాబ్ రిలీజ్ చేస్తామ‌ని వెల్ల‌డించాడు. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌కు ఇంకా కొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. జూన్ 16న ముహూర్తం ఫిక్స్ చేశారు. తాజాగా మూవీ మేక‌ర్స్ కు బిగ్ షాక్ త‌గిలింది. చిత్రానికి సంబంధించి కొన్ని స‌న్నివేశాలు ఆన్ లైన్ లో లీక్ అయిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

దీనిపై సీరియ‌స్ అయ్యారు ద‌ర్శ‌కుడు మారుతి. ఎవ‌రైనా స‌రే రాజా సాబ్ చిత్రానికి సంబంధించి కంటెంట్ కానీ లేదా ఇత‌ర సన్నివేశాల‌ను షేర్ చేసినా లేదా పంచుకున్నా తీవ్ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. సోష‌ల్ మీడియా ఖాతాల‌ను బ్లాక్ చేసేలా ఫిర్యాదు చేస్తామ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com