తమిళ చలన చిత్ర పరిశ్రమలో స్పెషల్ స్టార్ ఇమేజ్ స్వంతం చేసుకున్న ఏకైక నటుడు తలైవా రజనీకాంత్. తను కీలక పాత్ర పోషించిన చిత్రం లాల్ సలామ్. ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఓ ప్రత్యేకత కూడా ఉంది. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. భారీ అంచనాల మధ్య విడుదలైంది. గత ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. రజనీకాంత్ అభిమానులు పెద్ద ఎత్తున ఆదరించారు. మరో వైపు సినిమాను నేరుగా, థియేటర్లలో చూడలేని వారికి తీపి కబురు చెప్పారు మూవీ మేకర్స్. ఈ మేరకు పెద్ద ఎత్తున లాల్ సలామ్ ను ఓటీటీల్లోకి తీసుకు రావాలని ఒత్తిడి తీసుకు రావడంతో కీలక ప్రకటన చేశారు.
ఈ మేరకు ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ వేదికగా జూన్ 6వ తేదీన లాల్ సలామ్ అందుబాటులోకి రానుందని వెల్లడించింది. హిందూ ముస్లింలు ఐకమత్యంగా మెలిగే ఊరికి సంబంధించిన కథతో దీన్ని రూపొందించారు ప్రత్యేకంగా. ఆ ఊరు నుంచి మొయి నుద్దీన్ (రజనీకాంత్ ) ముంబైకి వెళ్లి గొప్ప వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. తన కొడుకును క్రికెటర్ గా చేయాలన్నది ఆయన కల కంటాడు.
తను అనుకోకుండా రజనీకాంత్ ఊరు వెళ్లి పోతాడు. ఆ సమయంలో రాజకీయ నేతల కుట్రల కారణంగా ఊరిలోని ప్రజలు రెండు వర్గాలుగా చీలి పోతారు ఇదీ లాల్ సలామ్ కథ. ఇదే సమయంలో రెండు జట్ల మధ్య జరిగే క్రికెట్ ఆటకు మతం రంగు పూశారు. రెండింటి మధ్య గొడవ జరుగుతుంది. దీని వెనుక అసలు కారణం ఏమిటి అనేదే లాల్ సలామ్ చిత్రం.