అందరి కళ్లు ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ నటించిన చిత్రం కూలీ సినిమాపైనే ఉన్నాయి. దీనిని అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు అన్నీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. దీంతో బహిరంగ మూవీ మార్కెట్ లో హెవీ డిమాండ్ ఏర్పడింది. భారీ ఎత్తున పోటీ పడుతున్నారు టాలీవుడ్ లో తెలుగు రైట్స్ తీసుకునేందుకు.
ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ కూలీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మూవీ మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో రోజు రోజుకు అంచనాలు మరింత పెరిగేలా చేస్తున్నాయి. ప్రత్యేకించి రజనీకాంత్ నటించిన జైలర్ కూడా రికార్డు బ్రేక్ చేసింది. 70 ఏళ్లు పైబడినా ఇంకా తనలో స్టార్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించే ప్రయత్నం చేశాడు తలైవా.
ఇక కూలీ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది సన్ నెట్ వర్క్స్ సంస్థ. తాజాగా సినీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు కూలీ తెలుగు రైట్స్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ , దిల్ రాజు, ఆసియన్ సునీల్, అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ పోటీ పడుతున్నారని టాక్. ఇదిలా ఉండగా కుబేర ధర రూ. 40 నుంచి 45 కోట్ల దాకా పలుకుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అయితే ఆసియన్ సునీల్ కూలీ తెలుగు రైట్స్ దాదాపు చేజిక్కించుకున్నట్లు సమాచారం. అంతకు ఇదే సంస్థ గతంలో రజనీకాంత్ నటించిన జైలర్ తెలుగు రైట్స్ ను కైవసం చేసుకుంది. సన్ పిక్చర్స్ యాజమాన్యం సునీల్ సంస్థకే అప్పగించేందుకు మొగ్గు చూపినట్లు టాక్.