సినీ పరిశ్రమలో పని గంటల విధానం మరోసారి చర్చకు దారితీసేలా చేసింది. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే. తను ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు వంగా సందీప్ రెడ్డిపై తను చేసిన కామెంట్స్. పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన డార్లింగ్ ప్రభాస్ తో స్పిరిట్ పేరుతో సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే కథ వినిపించాడు. దీనికి ఓకే చెప్పాడు హీరో. పోస్టర్స్ కూడా రిలీజ్ చేశాడు.
సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమాలో నటింప చేసేందుకు ముందుగా పలువురి హీరోయిన్లను తను అనుకున్నాడు. వీరిలో ఒకరు దీపికా పదుకొనే. ఇదిలా ఉండగా ప్రభాస్, దీపికా కలిసి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇటీవల బిగ్ సక్సెస్ అయిన కల్కి మూవీలో నటించారు. ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనికి సీక్వెల్ మూవీ కొనసాగుతోంది.
ఇది పక్కన పెడితే వంగా సందీప్ రెడ్డి తనకు 60 రోజుల పాటు పూర్తి సమయం కేటాయించాలని షరతు విధించాడని, అందుకే తాను తప్పుకుంటున్నట్లు , ప్రభాస్ తో స్పిరిట్ లో నటించడం లేదని ఇప్పటికే సంచలన ప్రకటన చేసింది దీపికా పదుకొనే. దీనిపై సీరియస్ గా స్పందించాడు వంగా సందీప్ రెడ్డి. తను చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని పేర్కొన్నాడు. తను ఎవరి మాట వినడు. తాను రోజుకు 8 గంటలకు పైగా సమయం కేటాయించమని కోరలేదన్నాడు. కేవలం వేరే మూవీస్ తో షూటింగ్ లో పాల్గొన కూడదని స్పష్టం చేశాడు. దీనినే ప్రత్యేకంగా ప్రస్తావించింది దీపికా పదుకొనే.
చివరకు ఇద్దరి మధ్య మాటల యుద్దం కొనసాగింది. ఈ తరుణంలో సంచలన ప్రకటన చేసింది దీపికా. తాను వంగాతో నటించడం లేదని ప్రకటించింది. ఇదే సమయంలో హాలీవుడ్ రేంజ్ లో రాబోతోన్న దర్శకుడు అట్లీ కుమార్ , బన్నీ సరసన దీపికా ఓకే అయ్యింది. ఇటీవలే వీడియో కూడా రిలీజ్ చేసింది సన్ పిక్చర్స్. ఈ సందర్బంగా రాణా దగ్గుబాటి కీలక వ్యాఖ్యలు చేశాడు. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని 8 గంటల పాటు పని చేయించ లేరంటూ స్పష్టం చేశాడు.