అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసింది. విజేతగా ఆర్సీబీ నిలిచింది. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ జట్టు కప్ ను స్వంతం చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ జట్టు ప్లేయర్ ఫిల్ సాల్ట్ సంచలనంగా మారాడు. ఫుల్ ఫామ్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య సిక్స్ కొట్టేందుకు ప్రయత్నం చేశాడు. బంతి బౌండరీ లైన్ దాటే సమయంలో ఎవరూ ఊహించని సమయంలో ఆర్సీబీ ఆటగాడు సాల్ట్ కళ్లు చెదిరేలా బంతిని అందుకున్నాడు.
లైన్ దాటినా ఎక్కడా తాక లేదు. ఈ క్యాచ్ మెగా టోర్నీలోనే హైలెట్ గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. తను పట్టిన క్యాచ్ మ్యాచ్ ను తిప్పేసిందని చెప్పక తప్పదు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 190 రన్స్ చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు కేవలం 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
చేజేతులారా మ్యాచ్ ను పోగొట్టుకుంది. ఒక రకంగా పడుతూ లేచినా చివరి దాకా పోరాడిన తీరు అద్భుతం అని చెప్పక తప్పదు. ప్రియాన్ష్ 19 బంతుల్లో 24 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఇక ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ 22 బంతులు ఆడి 26 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్సర్లు ఉన్నాయి. తొలి వికెట్ కు ఈ ఇద్దరు కుర్రాళ్లు 43 రన్స్ జోడించారు. వీళ్లను కట్టడి చేయడంలో ఆర్సీబీ బౌలర్లు సక్సెస్ అయ్యారు.