ఉత్తర ప్రదేశ్ – స్టార్ యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ సంచలనంగా మారారు. పొలిటికల్ లీడర్ ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం జరిగింది. యూపీ లక్నోలోని స్టార్ హోటల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, క్రికెట్ , క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఇరు కుటుంబాల తరపున బంధవులు పాల్గొన్నారు. తను పేద కుటుంబం నుంచి వచ్చాడు. గతంలో జరిగిన ఐపీఎల్ వేలం పాటలో అనూహ్యంగా కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఎన్నికయ్యాడు.
ఆ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. దీంతో తను దేశ వ్యాప్తంగా ఫేమ్ అయ్యాడు. కేకేఆర్ తరపున తను ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. ఇదే సమయంలో భారత జట్టు తరపున ఆడుతున్నాడు. టి20 ఫార్మాట్ లో పలు మ్యాచ్ లలో ఆడాడు. అద్భుతమైన ప్రతిభా పాటవాలను కలిగి ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ నిశ్చితార్థ వేడుక ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడారు.
కొన్ని నెలల క్రితం ప్రియా తండ్రి ఇద్దరి సంబంధ స్థితిని స్పష్టం చేశారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అయిన తుఫానీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రింకు సింగ్, ప్రియా సరోజ్ ఇద్దరూ తమ తల్లిదండ్రుల అనుమతి కోరారని చెప్పారు. ఇద్దరు పిల్లలు వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు.
ఇక క్రికెటర్ రింకూ సింగ్ విషయానిక వస్తే 2025 ఐపీఎల్ సీజన్లో సాధారణ ఆటగాడిగా ఉన్నాడు, 29.42 సగటుతో 153.73 స్ట్రైక్ రేట్తో 206 పరుగులు చేశాడు. భారత టీ20ఐ జట్టులో రింకు కూడా ముఖ్యమైన సభ్యుడు. 30 టీ20 మ్యాచ్లు ,22 ఇన్నింగ్స్లలో 46.09 సగటుతో 165.14 స్ట్రైక్ రేట్తో 507 పరుగులు చేశాడు, ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతను ఇంకా తన తొలి టీ20ఐ సెంచరీని నమోదు చేయలేదు. 27 ఏళ్ల ఈ ఆటగాడు 2023లో ఐర్లాండ్తో జరిగిన టీ20ఐలో అరంగేట్రం చేశాడు.