ఆట అన్నాక గెలుపు ఓట‌ములు స‌హ‌జం

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్కిప్ప‌ర్ పంత్

గుజ‌రాత్ – అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ కు చుక్క‌లు చూపించింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ . ముందుగా బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి 235 ర‌న్స్ చేసింది. అనంత‌రం గుజ‌రాత్ టైటాన్స్ 9 వికెట్లు కోల్పోయి 202 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో 33 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

మ్యాచ్ అనంత‌రం ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్ మీడియాతో మాట్లాడారు. తాము అనుకున్నంత మేర ఆడ‌లేక పోయామ‌ని ఒప్పుకున్నాడు. ప్ర‌ధానంగా తాను ఫామ్ లేక పోవ‌డం కూడా ఇబ్బందిగా మారింద‌న్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మ్యాచ్ ల‌లో ఆరు మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించి 12 పాయింట్లతో ఉన్నా ప్లే ఆఫ్స్ కు చేర‌లేక పోయింది ల‌క్నో.

త‌ను ఆడిన మ్యాచ్ ల‌లో కేవ‌లం 151 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. ఈ ఐపీఎల్ 18వ సీజ‌న్ లో అత్యంత పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న. విచిత్రం ఏమిటంటే దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ వేలం పాట‌లో ప్ర‌పంచ క్రికెట్ రంగం విస్తు పోయేలా ఏకంగా రిష‌బ్ పంత్ ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ యాజ‌మాన్యం రూ. 27 కోట్ల‌కు కొనుగోలు చేసింది.

త‌న ప‌ర్ ఫార్మెన్స్ బాగా లేక పోవ‌డంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు ఓన‌ర్ సంజ‌య్ గోయెంకా. ఈ సంద‌ర్బంగా పంత్ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. ఆట అన్నాక గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌న్నాడు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com