27 కోట్లు ప‌లికాడు ఐపీఎల్ లో చేతులెత్తేశాడు

ఐపీఎల్ 2025లో తీవ్ర నిరాశ ప‌ర్చిన పంత్

ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయిన క్రికెట‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు ఢిల్లికి చెందిన రిష‌బ్ పంత్. త‌నను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ యాజ‌మాన్యం ఏకంగా దుబాయ్ లో జ‌రిగిన ఐపీఎల్ వేలం పాట‌లో రూ. 27 కోట్ల‌కు కొనుగోలు చేసింది. సంజ‌య్ గోయెంకా త‌ల ప‌ట్టుకున్నాడు. త‌న‌ను ఏరికోరి తీసుకున్నందుకు. అంతే కాదు కెప్టెన్సీ కూడా అప్ప‌గించారు. అయినా అటు స్కిప్ప‌ర్ గా త‌న జ‌ట్టును గెలిపించ‌లేక పోయాడు. ఆట‌గాడిగా కూడా ఘోరంగా వైఫ‌ల్యం చెందాడు.

టోర్నీలో మొత్తం రిష‌బ్ పంత్ 12 మ్యాచ్ లు ఆడాడు. మొత్తంగా 135 ప‌రుగులు చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచ‌రీ ఉంది. దీంతో పెద్ద ఎత్తున ట్రోల్ కు గుర‌వుతున్నాడు. ఆ మ‌ధ్య‌న రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. తిరిగి కోలుకున్నాడు. జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత ఐపీఎల్ వేలం పాట సంద‌ర్భంగా సెన్సేష‌న్ గా మారాడు. ఒక క్రికెట‌ర్ ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేయ‌డం భార‌త క్రికెట్ రంగంలో ఇదే ఫ‌స్ట్ టైం. ఆ త‌ర్వాత చాలా మంది ఆట‌గాళ్లు 18 కోట్ల వ‌ర‌కు వ‌చ్చారు కానీ పంత్ ద‌రి దాపుల్లోకి రాలేక పోయారు.

తీరా చూస్తే రిషబ్ పంత్ పై న‌మ్మ‌కంతో గోయెంకా అంత ధ‌ర‌కు కొనుగోలు చేసినా ప‌ర్ ఫార్మెన్స్ ప‌రంగా అయితే గ‌ల్లీ క్రికెట‌ర్ కంటే అధ్వాన్నంగా ఆడాడు. దీనిపై తీవ్రంగా మండిప‌డ్డాడు. ఇదే స‌మ‌యంలో కేవ‌లం 14 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన బీహార్ కు చెందిన వైభ‌వ్ సూర్య వంశీ ఈసారి ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. దుమ్ము రేపాడు. సెంచ‌రీతో క‌దం తొక్కాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు. త‌న‌ను ఈ సంద‌ర్బంగా సంజ‌య్ గోయెంకా మెచ్చుకున్నాడు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com