అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మెగా టోర్నీలో ఫుల్ ఫామ్ లో కొనసాగుతూ వస్తున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ స్కిప్పర్ శ్రేయాస్ అయ్యర్ ను బోల్తా కొట్టించాడు రొమారియో షెఫర్డ్. అంతకు ముందు మ్యాచ్ లో భాగంగా ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ ఇచ్చిన క్యాచ్ ను చేతుల్లోకి వచ్చి జారి పోయింది. దీంతో నిరాశకు గురయ్యాడు. కానీ ఊహించని విధంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ షెఫర్డ్ పై నమ్మకం ఉంచాడు. తనపై పెట్టుకున్న నమ్కకాన్ని వమ్ము చేయలేదు ఈ బౌలర్.
సూపర్ స్పెల్ తో తికమక పెట్టించాడు షెఫర్డ్. అవుట్ సైడ్ బాల్ ను వేసి షాట్ కొట్టేలా రెచ్చగొట్టాడు. తన ప్లాన్ వర్కవుట్ అయ్యింది. అప్పటికే 2 కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అయ్యర్ అనవసరంగా షాట్ కొట్టేందుకు ప్రయత్నం చేశాడు. అది కాస్తా మరో పేసర్ భువనేశ్వర్ కుమార్ చేతిలోకి వెళ్లి పోయింది. దీంతో పంజాబ్ పై ఆర్సీబీ ఆధిపత్యం వహించింది. కానీ శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లీష్ లు మ్యాచ్ ను ముగించకుండా ధీటుగా ఎదుర్కొన్నారు. ఆర్సీబీ బౌలర్లను ఉతికి ఆరేశారు. ప్రధానంగా చెప్పు కోవాల్సింది సింగ్ గురించి. తను సిక్సర్లు, ఫోర్లతో విరుచుకు పడ్డాడు.
ఇక షెఫర్డ్ బౌలింగ్ లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ దారి పట్టాడు శ్రేయస్ అయ్యర్. మొత్తంగా ఈ మ్యాచ్ లో ఓటమి పాలు కావచ్చు. కానీ శ్రేయాస్ ఆటగాడిగా, స్కిప్పర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ను ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.