గుజరాత్ – భారత అమ్ముల పొదిలోకి త్వరలోనే రుద్రాస్త్ర అనే వినూత్న మానవ రహిత విమానం (యూఏవీ) రానుంది.సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించిన ఈ హైబ్రిడ్ యూఏవీని రాజస్థాన్లోని పోఖ్రాన్లో విజయవంతంగా పరీక్షించారు. రుద్రాస్త్ర ఎంచుకున్న లక్ష్యంపై ఖచ్చితత్వంతో దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఆత్మ నిర్భర్ భారత్లో రక్షణ రంగ టెక్నాలజీ అభివృద్ధికి రుద్రాస్త్ర నిదర్శనం అని పేర్కొన్నాయి. రుద్రాస్త్ర సక్సెస్ కావడం పట్ల ప్రధాని మోదీ అభినందించారు.
‘రుద్రాస్త్ర’ యుఏవీ పోఖ్రాన్లో కీలకమైన ఆర్మీ ట్రయల్స్లో 170 కి.మీ. రేంజ్, 1.5 గంటల ఎండ్యూరెన్స్తో ప్రెసిషన్ వార్హెడ్తో దూసుకు వెళ్లింది. లక్ష్యాన్ని చేరుకుంది నేరుగా. నాగ్పూర్కు చెందిన సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL) పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో దాని హైబ్రిడ్ వర్టికల్ టేక్-ఆఫ్ అండ్ ల్యాండింగ్ (VTOL) యుఏవీ, రుద్రాస్త్ర కీలకమైన ట్రయల్ను సక్సెస్ ఫుల్ గా పరీక్షించింది.
ఈ విషయాన్ని అధికారికంగా భారతీయ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. రుద్రాస్త్ర విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియ చేశారు. భారతీయ అమ్ముల పొదిలో ఇది చేరడం ఆనందంగా ఉందన్నారు. కాగా రుద్రాస్త్ర పరీక్షను భారత సైన్యం నిర్దేశించిన కఠినమైన పనితీరు పారామితుల కింద నిర్వహించారు, వీటిలో ప్రెసిషన్ స్ట్రైక్ సామర్థ్యం, VTOL కార్యాచరణ, \మిషన్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నాయి.
ట్రయల్ సమయంలో, స్థిరమైన రియల్-టైమ్ వీడియో ఫీడ్ను కొనసాగిస్తూ రుద్రాస్త్ర 50 కి.మీ. కంటే ఎక్కువ మిషన్ వ్యాసార్థాన్ని కవర్ చేసింది. ఇది అధిక విశ్వసనీయతను ప్రదర్శిస్తూ విజయవంతంగా దాని ప్రయోగ స్థానానికి తిరిగి వచ్చింది. లక్ష్య ప్రాంతంలో సంచరించే సమయంతో సహా యుఏవీ మొత్తం 170 కి.మీ. కంటే ఎక్కువ దూరాన్ని నమోదు చేసింది.