న్యూఢిల్లీ – భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్న తరుణంలో సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్. ఆయన మీడియాతో మాట్లాడారు. యావత్ ప్రపంచం మొత్తం కళ్లారా పాకిస్తాన్ దుందుడుకు , ఉగ్రవాద చర్యలను అని అన్నారు. పూర్తిగా అబద్దాలు చెబుతూ భారత్ పై కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ కు పుట్టగతులు ఉండవన్నారు. తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు.
కాల్పుల విరమణ ఎవురు కోరుకున్నారో అందరికి తెలుసు అని అన్నారు జై శంకర్. భారత్ కేవలం పీవోకే, టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతోందన్నారు. సింధూ జలాల నిలిపివేతపై యథాతథస్థితి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధూ నదీజలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని చెప్పారు కేంద్ర మంత్రి. పాక్ ఉగ్రవాదులను భారత్కు అప్పగించాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఇతర దేశాలు అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం లేదన్నారు జై శంకర్. థర్డ్ పార్టీ జోక్యాన్ని సహించ బోమంటూ వార్నింగ్ ఇచ్చారు. టెర్రర్ క్యాంప్స్ ను మూసి వేయాలని, లేక పోతే పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.