సాక్షి యాంక‌ర్ కొమ్మినేని శ్రీ‌నివాస రావు అరెస్ట్

హైద‌రాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైద‌రాబాద్ – సాక్షి యాంక‌ర్ , జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస రావుకు బిగ్ షాక్ త‌గిలింది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ రైతుల‌పై నోరు పారేసుకోవ‌డం, పెద్ద ఎత్తున ఆందోళ‌న చెల‌రేగ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్ స్టేష‌న్ లో త‌న‌పై కేసు న‌మోదైంది. ఈ మేర‌కు రంగంలోకి దిగిన పోలీసులు హైద‌రాబాద్ కు వ‌చ్చేశారు. త‌న నివాసంలో ఉన్న కొమ్మినేని శ్రీ‌నివాస రావుకు నోటీసులు అంద‌జేశారు.

వెంట‌నే త‌న‌ను తాము తీసుకు వ‌చ్చిన వాహ‌నంలోకి ఎక్కించారు. ముందుగా విజ‌య‌వాడ‌కు త‌ర‌లించి అక్క‌డి నుంచి గుంటూరు కోర్టులో హాజ‌రు ప‌రుస్తారా లేదా అనే విష‌యం ఇంకా స‌మాచారం లేదు. కాగా అధికారం ఉంది క‌దా అని ఆనాటి స‌ర్కార్ కు వంత పాడుతూ, జ‌గ‌న్ రెడ్డిని జోకుతూ , సాక్షి ఛానెల్ లో అడ్డ‌మైన వాగుడు వాగుతూ ప్ర‌జ‌ల‌ను రెచ్చ గొడుతున్నాడ‌ని, రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళా రైతుల‌ను కించ ప‌రిచేలా, స‌భ్య స‌మాజం సిగ్గు ప‌డేలా కామెంట్స్ చేశాడంటూ ఫిర్యాదు అందింది.

అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి లో కొమ్మినేని నిర్వహించిన చర్చలో జర్నిలిస్టు క్రిష్ణంరాజు చేసిన వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున నిరసన లు వ్యక్తం అయ్యాయి. అమరావతి రైతులు.. మహిళల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసుకు సంబంధించి సాక్షి యాజ‌మాన్యంపై కూడా కేసు న‌మోదైంది.

వ్యాఖ్యలు చేసిన క్రిష్ణంరాజుతో పాటుగా షో నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు.. సాక్షి యాజమాన్యం పైన పలువురు ఫిర్యాదులు చేసారు. తుళ్లూరు లో నమోదైన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. ఇదిలా ఉండ‌గా విజ‌య‌వాడ‌లో ఉంటున్న కృష్ణంరాజును అరెస్ట్ చేసేందుకు వెళ్ల‌గా అక్క‌డ ఆయ‌న ఇంటికి తాళం వేసి ఉంది. త‌న కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com