కేజీఎఫ్ చిత్రంతో దేశమంతా తన వైపు చూసేలా చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. టేకింగ్ , మేకింగ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ కలిగి ఉన్న డైరెక్టర్. తను ప్రస్తుతం కేజీఎఫ్ -2 తర్వాత డార్లింగ్ ప్రభాస్ తో సలార్ సినిమా తీస్తున్నాడు.
ఈ సినిమా ఈ సెప్టెంబర్ 28న విడుదల చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు లేదంటూ ప్రకటించారు. పోస్టర్లు రిలీజ్ చేసినా ఇప్పటి వరకు ఎప్పుడు సినిమా బయటకు వస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేక పోయాడు ప్రశాంత్ నీల్.
ఇదిలా ఉండగా ప్రభాస్ కు ఈ మధ్యన తను నటించిన రెండు సినిమాలు ఆశించిన మేర ఆడలేదు. పూఆ హెగ్డేతో కలిసి నటించిన రాధే శ్యామ్ , ఓం రౌత్ తీసిన ఆది పురుష్ దెబ్బ కొట్టాయి. ఇక పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన ప్రభాస్ ప్రశాంత్ నీల్ పై నమ్మకం పెట్టుకున్నాడు.
ఇక సలార్ లో ప్రభాస్ తో కమల్ హాసన్ కూతురు శృతీ హాసన్ నటిస్తోంది . సంజయ్ దత్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. మొత్తంగా సలార్ కోసం వేచి చూస్తున్నారు. కానీ ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్టు టాక్.