పాన్ ఇండియా హీరోయన్ గా గుర్తింపు పొందింది సమంత రుత్ ప్రభు. మొన్నటి దాకా అటు మూవీస్ ఇటు వెబ్ సీరీస్ తో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఉన్నట్టుండి అందరినీ విస్తు పోయేలా చేసింది. నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది. నాగ చైతన్యతో విడి పోయాక కొంత కాలంపాటు దూరంగా ఉంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ చిత్రంలో నటించింది. ఆ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. మ్యూజికల్ గా బిగ్ హిట్ గా నిలిచింది. ఇది పక్కన పెడితే ఉన్నట్టుండి సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప మూవీలో ఊ అంటావా అంటూ స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరిసింది. కుర్ర కారు గుండెలను తాకింది. ఆ తర్వాత పుష్ప 2లో లవ్లీ గర్ల్ శ్రీలీల కిస్సక్ అంటూ కైపెక్కించింది.
ఆ తర్వాత సమంత నిర్మాతగా తెలుగులో శుభం పేరుతో హార్రర్, రొమాంటిక్ కథాంశంగా తెరకెక్కించింది. దీనిని ప్రేక్షకులు ఆదరించారు. మంచి లాభాలు తెచ్చి పెట్టింది తనకు. ఈ సినిమా సక్సెస్ కావడంతో సమంత రుత్ ప్రభు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తను ప్రముఖ దర్శకుడు, వెబ్ సీరీస్ లను తీసే రాజ్ నిడుమోరుతో కలిసి చెట్టా పట్టాల్ వేసుకుని తిరగడం మొదలు పెట్టింది. అయితే దీనిపై తీవ్రంగా స్పందించి దర్శకుడి భార్య. ఆ ఇద్దరిది స్నేహం మాత్రమేనని రిలేషన్ షిప్ లో లేరంటూ పేర్కొంది . దీనిని సమర్థిస్తూ సమంత రుత్ ప్రభు కూడా వ్యాఖ్యానించింది.
అయితే వీరు దిగిన ఫోటోలు అలా లేవు. పూర్తిగా ఒకరిపై మరొకరు ప్రేమలో కూరుకు పోయినట్లుగా ఫీలింగ్స్ ఫోటోస్ లో కనిపిస్తున్నాయి. డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే ఒక్కటి కాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సమంత, రాజ్ ఇద్దరూ కలిసి అబుదాబిలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు టాక్.