వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు భంగం క‌లిగిస్తే ఎలా..?

స్టార్ హీరోయిన్ స‌మంత రుత్ ప్ర‌భు ఫైర్

అందాల ముద్దుగుమ్మ స‌మంత రుత్ ప్ర‌భుకు కోపం వ‌చ్చింది. తాము మ‌నుషులేమ‌న‌ని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ త‌మ ప్రైవసీకి భంగం క‌లిగించేలా ఫోటోలు తీస్తే ఎలా అంటూ సుతిమెత్త‌గా సీరియ‌స్ అయ్యింది. ఈ ఘ‌ట‌న ముంబైలో జరిగింది. త‌ను సామాన్యంగా ఎవ‌రినీ కోప‌గించుకోదు. త‌న‌కు ఆగ్ర‌హం రాదు. ఎప్పుడో త‌ప్పితే. త‌ను కూల్ గా , ప్ర‌శాంతంగా ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంది. త‌ను ఎక్కువ‌గా యోగా, ధ్యానం మీద ఫోక‌స్ పెడుతుంది. ర‌విశంక‌ర్ సుద‌ర్శ‌న ప్ర‌క్రియ‌, జ‌గ్గీ వాసు దేవ‌న్ ఆస‌నాలు వేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైర‌ల్ అయ్యాయి.

తాజాగా త‌ను హైద‌రాబాద్, చెన్నైల‌ను వ‌దిలేసింది. ఇప్పుడు త‌న మ‌కాం ముంబైకి మార్చేసింది. ఇక్క‌డ ఫుల్ బిజీగా మారి పోయింది. విచిత్రం ఏమిటంటే త‌న‌ను సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్. త‌ను తీసిన ఏమాయే చేశావే సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. అతి పెద్ద ప్రేమ కావ్యంగా, మ్యూజిక‌ల్ హిట్ గా నిలిచింది. దీనికి ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించాడు. ఆ త‌ర్వాత త‌మిళం, తెలుగు చిత్రాల‌లో వ‌రుస‌గా న‌టిస్తూ టాప్ హీరోయిన్ గా కొన‌సాగింది కొన్నాళ్ల పాటు.

వెబ్ సీరీస్ లో కీ రోల్ పోషించింది. ఉన్న‌ట్టుండి నాగ చైత‌న్య‌తో పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత ఏమైందో కానీ విడాకులు ఇచ్చింది. ఇప్పుడు ఒంట‌రిగా ఉంటోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఖుషీలో న‌టించింది. ఆ త‌ర్వాత ఏ సినిమా త‌న‌నుంచి రాలేదు. కాగా ప్ర‌స్తుతం త‌ను జిమ్ లో బిజీగా గ‌డుపుతోంది. ఈ సంద‌ర్బంగా ఫోటోలు, కెమెరాలు క్లిక్ మనిపించ‌డంతో మండిప‌డింది. వైర‌ల్ గా మారింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com