జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మందిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ సందర్బంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ పై దాడి చేసింది. చివరకు అమెరికా జోక్యంతో సద్దుమణిగింది. ఈ సందర్బంగా పాకిస్తాన్ కు చెందిన సినిమాలు, కళాకారులు, న్యూస్, వినోద, క్రీడా రంగానికి చెందిన అన్నింటిని కేంద్రం నిషేధం విధించింది. తాజాగా మరింత రాద్దాంతం చోటు చేసుకుంది ఈ మూవీ గురించి. ఇందుకు ప్రధాన కారణం సినిమాలో కీ రోల్ పోషించింది పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖ నటి హానియా అమీర్.
అంతే కాకుండా ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ పాకిస్తాన్ నటి భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసిందనే ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాను ఇండియా బ్యాన్ చేసింది. ఇదిలా ఉండగా సర్దార్జీ మూవీలో ముఖ్యమైన పాత్ర పోషించింది తను. దీనిని పూర్తిగా దర్శకుడు కామెడీ, హారర్ మూవీగా తెరకెక్కించాడు. విచిత్రం ఏమిటంటే ఇంత రాద్దాంతం చోటు చేసుకున్నా ఎక్కడా తగ్గడం లేదు సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజే. తన ఇన్ స్టా ఖాతా ద్వారా కీలక ప్రకటన చేశాడు. అధికారికంగా 27న సర్దార్జీ మీ ముందుకు వస్తోందని వెల్లడించాడు. దీంతో తనపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు అభిమానులు.