విలక్షణ దర్శకుడిగా గుర్తింపు పొందాడు శేఖర్ కమ్ముల. తను తీస్తున్న చిత్రం కుబేరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తన టేకింగ్, మేకింగ్ పై నమ్మకం ఉండడంతో అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు కుబేర చిత్రం కోసం. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది.
అదేమిటంటే కుబేర చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ బిజినెస్ దాదాపు రూ. 40 కోట్లకు పైగానే వస్తోందని అంచనా వేస్తున్నారు సినీ వర్గాలు. ఆంధ్ర నుంచి రూ. 18 కోట్లు కాగా తెలంగాణ నుంచి రూ. 22 కోట్లుగా ఉండనుందని టాక్. కుబేర మూవీని శేఖర్ కమ్ముల పాన్ ఇండియా స్థాయిలో తీశాడు. సినిమా డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయని మూవీ మేకర్స్ వెల్లడించారు.
ఎక్స్ వేదికగా శేఖర్ కమ్ముల స్వయంగా అక్కినేని డబ్బింగ్ చెబుతున్న ఫోటోలను షేర్ చేశాడు. ఇవి వైరల్ గా మారాయి. గతంలో తను కాలేజ్ డేస్, గోదావరి , ఫిదా సినిమాలు తీశాడు. అవన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఎలాంటి బూతు, ద్వందర్థాలు లేకుండా మూవీస్ ను తెరకెక్కిస్తాడన్న పేరుంది దర్శకుడికి. దీంతో కుబేర ఏ స్థాయిలో ఉండనుందోనని ప్రేక్షకులు వేచి చూస్తున్నారు.
నాగార్జునతో పాటు తమిళ సూపర్ స్టార్ ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కుబేరలో ఉండడం ప్లస్ పాయింట్ కానుందని సినీ విమర్శకుల కామెంట్. జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. సో జస్ట్ అండ్ వెయిట్ మూవీ కోసం.