బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కీలక ప్రకటన చేసింది. ఇంగ్లండ్ తో ఆడే టెస్టు సీరీస్ కు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ను ఎంపిక చేసింది. ఐపీఎల్ లో టాప్ ఫామ్ ను కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ స్కిప్పర్ గా సక్సెస్ అయ్యాడు. గత సీజన్ లో పేలవమైన ప్రదర్శన చేపట్టింది ఆ జట్టు. కానీ తను వచ్చాక సీన్ మార్చేశాడు. పూర్తిగా జట్టులో స్పూర్తి నింపాడు. అద్భుతమైన నాయకత్వంతో ఆకట్టుకున్నాడు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ టీమ్ ను గెలుపు బాటలో పయనించేలా చేశాడు.
ఏకంగా పంజాబ్ ను ప్లే ఆఫ్స్ కు తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. గత ఏడాది 2024లో జరిగిన ఐపీఎల్ 17వ సీజన్ లో శ్రేయాస్ అయ్యర్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు స్కిప్పర్ గా ఉన్నాడు. ఏకంగా ఆ జట్టును ఐపీఎల్ విజేతగా నిలిపాడు. తనను ఏరికోరి పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ మేనేజ్ మెంట్ భారీ ధరకు కొనుగోలు చేసింది. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అయ్యర్. కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు. ఆటగాడిగా పరుగులు చేశాడు కీలక సమయంలో.
ఇదిలా ఉండగా శ్రేయస్ అయ్యర్ ను టెస్టు, వన్డే, టి20 ఫార్మాట్ కు ఎంపిక చేస్తారని అనుకున్నారు. తాజాగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఉన్నపళంగా షాక్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన టెస్టు టీంలో అయ్యర్ కు మొండి చేయి చూపించింది. తన ఫ్యాన్స్ బీసీసీఐ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జట్టు పరంగా చూస్తే గిల్(కెప్టెన్), పంత్(వైస్ కెప్టెన్), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్రెడ్డి, జడేజా, జురెల్, సుందర్, శార్దుల్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్దీప్, అర్ష్దీప్సింగ్, కుల్దీప్యాదవ్ ఉన్నారు.