గుజరాత్ – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఊహించని రీతిలో బిగ్ షాక్ తగిలింది లక్నో సూపర్ జెయింట్స్ నుంచి గుజరాత్ టైటాన్స్ కు. ఇప్పటికే ఈ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఈ సందర్బంగా ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ షో చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు మైదానంలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 9 వికెట్లు కోల్పోయి 202 రన్స్ మాత్రమే చేసింది. 33 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ కోల్పోయినా గిల్ టీమ్ కు పోయింది ఏమీ లేదు. లక్నో తరపున తుక్కు రేగ్గొట్టారు మిచెల్ మార్ష్ , నికోలస్ పూరన్. ఇద్దరూ తుక్కు రేగ్గొట్టారు. మార్ష్ 117 రన్స్ చేస్తే పూరన్ 57 పరుగులు చేశాడు. మొత్తంగా గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీళ్ల దెబ్బకు గుజరాత్ బౌలర్లు బిక్కు బిక్కుమన్నారు.
ఇక లక్నో జట్టు విషయానికి వస్తే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ అనంతరం ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇరు జట్లు కరచాలనం చేసుకున్నారు. కానీ రిషబ్ పంత్ ను పట్టించుకోకుండా పోయాడు శుభ్ మన్ గిల్. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాను హల్ చల్ చేస్తున్నాయి.
శుభ్ మన్ గిల్ ఐపీఎల్ 2025లో సూపర్ షోతో ఆకట్టుకున్నాడు. పరుగుల వరద పారించాడు. తన జట్టును విజయపథంలో నడిపించాడు. సక్సెస్ ఫుల్ స్కిప్పర్ గా పేరొందాడు. ఇక లక్నో జట్టు విషయానికి వస్తే రిషబ్ పంత్ ఆశించిన మేర రాణించలేదు. ఐపీఎల్ వేలం పాటలో అత్యధిక ధరకు అమ్ముడు పోయాడు పంత్. ప్రపంచ క్రికెట్ లో ఏ క్రికెటర్ కు ఈ ఛాన్స్ దక్కలేదు. ఏకంగా లక్నో తనను రూ. 27 కోట్లకు తీసుకుంది. కానీ తను చేసిన రన్స్ కేవలం 151 రన్స్ మాత్రమే.