ప్రతిభావంతులైన గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది అదితి భావరాజు. తను సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. సింగర్ గా పలు పాటలు పాడారు. ముఖ వర్చస్సుతో పాటు అద్భుతమైన గాత్రం తన స్వంతం కావడంతో అనుకోకుండా నటించే ఛాన్స్ దక్కింది. సింగర్ నుంచి నటిగా మారనుంది ఈ ముద్దుగుమ్మ. తను తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో సాగే చిత్రం దండోరాలో నటించనుంది.
ఈ సినిమా కథ పూర్తిగా భిన్నమైనది. సామాజిక కోణంలో చూస్తే వాస్తవాలకు అద్దం పడుతుంది దండోరా చిత్రం అని దర్శకుడు స్పష్టం చేశాడు. ప్రేమ, గౌరవానికి సంబంధించిన కథ. మన సమాజంలోని కఠినమైన సత్యాలను, ప్రబలంగా ఉన్న , ప్రభావితం చేస్తున్న సామాజిక దురాచారాలను అన్వేషిస్తుందని తెలిపారు. ఇందులో విలక్షణ నటుడు శివాజీ, నవదీప్, రవికృష్ణ, నందు, మాణికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధయ్య, తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలలో చిత్రీకరిస్తున్నారు దర్శకుడు కీలకమైన సన్నివేశాలను. ఈ తారగణంలో సింగర్ అదితి భావరాజు చేరింది. కీలకమైన పాత్ర పోషిస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. దండోరా నిర్మాణ దశలో ఉంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో అనేక కీలక షెడ్యూల్ లను పూర్తి చేసింది. ఇటీవలే దండోరా ఫస్ట్ బీట్ ను రిలీజ్ చేశారు. మంచి స్పందన లభించింది. దీంతో ప్రాజెక్టు పై అంచనాలు మరింత పెరిగేలా చేశాయి.
దండోరా మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తుండగా మార్క్ కె. రాబిన్ మ్యూజిక్ ఇచ్చాడు. రవీంద్ర బెనర్జీ నేతృత్వంలోని లౌక్య ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ సంస్థ గతంలో కలర్ ఫోటో, బెదురు లంక 2012 సినిమాలను తీసింది. ఈ రెండూ సక్సెస్ అయ్యాయి. మూడో ప్రాజెక్టు దండోరాగా రానుంది.