హైదరాబాద్ – జానపద, సినీ గాయకురాలిగా గుర్తింపు పొందిన మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ తన బర్త్ డే సందర్బంగా హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని రిస్టార్ లో నిర్వహించిన ఈవెంట్ కలకలం రేపింది. చేవెళ్ల పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. గంజాయి, పెద్ద ఎత్తున ఫారిన్ లిక్కర్ బయట పడింది. సోదాలలో ప్రముఖులు సినీ రంగానికి చెందిన వారంతా పట్టుబడ్డారు. ఇందులో డ్రగ్స్ పట్టుబడడం విస్తు పోయేలా చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై గాయని మంగ్లీ స్పందించింది. చిలుక పలుకులు పలికింది. తను అమాయకురాలినని, తనకు ఏ పాపం తెలియదని అంటోంది.
అంతే కాదు తనకు ఈవెంట్ నిర్వహించాలంటే అనుమతి తీసుకోవాలనే విషయం తెలియదట. యాంకర్ గా పని చేసిన తను ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసింది. తన స్వస్థలం రాయలసీమ. ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది. తెలంగాణ యాసను నేర్చుకుంది. కష్టపడింది..స్టార్ గాయనిగా గుర్తింపు పొందింది. కానీ స్టార్ డమ్ వచ్చాక తనకు అహంకారం పెరిగింది. ఇదొక్కటే కాదు ఎక్కడికి వెళ్లినా వివాదాలకు కేరాఫ్ గా మారి పోయింది తన జీవన శైలి.
మా అమ్మ నాన్న కోరిక మేరకు రిసార్ట్ లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నానని చెప్పింది మంగ్లీ. సౌండ్ సిస్టమ్, లిక్కర్ కు పర్మిషన్ తీసుకోవాలన్న ఐడియా లేదని పేర్కొంది. ఎవరైనా గైడ్ చేసినా అనుమతి తీసుకునే దానంటూ చిలుక పలుకులు పలికింది ఈ ముద్దుగుమ్మ. తెలిసి తప్పు చేయలేదు. తెలియకుండా జరిగిందంటూ కలర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. తను జగ్గీ వాసుదేవన్ శివరాత్రి సమయంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.