తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం కుబేర. దీనిని ప్రముఖ సృజనాత్మకత కలిగిన దర్శకుడు శేఖర్ కమ్ముల తీశాడు. వాస్తవానికి సినిమా ట్రైలర్ తేదీ ముందుగానే ప్రకటించారు. కానీ అదే రోజు కన్నప్ప ఈవెంట్ ఉండడంతో దానిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 20వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు మూవీ మేకర్స్.
ఇందులో భాగంగా కుబేర ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఇదే సమయంలో ఈ సినిమా ఈవెంట్ కార్యక్రమం గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే స్టార్ హీరోలతో పాటు లవ్లీ బ్యూటీ నటించడం, పోస్టర్స్, టీజర్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా రానున్నారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తను ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. హాలీవుడ్ రేంజ్ లో ప్రిన్స్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో కలిసి ఎస్ఎంఎంబీ29 తీస్తున్నాడు.
ఇక శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తను గతంలోనే అద్భుతమైన దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. డాలర్ డ్రీమ్స్, కాలేజ్ డేస్, గోదావరి, ఫిదా..ఇలా చెప్పుకుంటూ పోతే దేనికదే సూపర్ . తన టేకింగ్ భిన్నంగా ఉంటుంది. ఎక్కువగా స్వోత్కర్ష ఉండదు. విచిత్రం ఏమిటంటే తన కెరీర్ లో తొలిసారిగా స్టార్ హీరో, హీరోయిన్లతో కలిసి కుబేర తీయడం. మరి ఏ మేరకు శేఖర్ కమ్ముల సక్సెస్ అవుతాడనేది వేచి చూడాలి.