ఐపీఎల్ ఫైన‌ల్ కోసం వెయిట్ చేస్తున్నా

ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి కామెంట్స్

యావ‌త్ క్రికెట్ ప్ర‌పంచం ఉత్కంఠ‌తో ఎదురు చూస్తోంది జూన్ 3న గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ మోదీ స్టేడియంలో జ‌రిగే కీల‌క‌మైన టాటా ఐపీఎల్ 2025 మెగా టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్ కు సంబంధించి. ఈ సంద‌ర్బంగా సినీ సెలెబ్రిటీస్ , వ్యాపార‌, వాణిజ్య, పారిశ్రామిక‌, రాజ‌కీయ‌, త‌దిత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు వెయిట్ చేస్తున్నారు. వ‌ర‌ల్డ్ లో అత్య‌ధికంగా సీటింగ్ కెపాసిటీ క‌లిగిన మైదానంగా పేరు పొందింది.

ఒక్క మ్యాచ్ కు ఏకంగా ల‌క్ష మందికి పైగా ప్ర‌త్య‌క్షంగా చూసే ఛాన్స్ ఉంది. ఇప్ప‌టికే టికెట్లు అమ్ముడు పోయాయి. ఈ కీల‌క‌మైన ఫైన‌ల్ మ్యాచ్ ను ల‌క్ష మంది క్రికెట్ అభిమానుల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తార‌ని బీసీసీఐ అంచ‌నా వేస్తోంది. దీనిని గ్రాండ్ గా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసింది ఇప్ప‌టికే. సినీ ప్ర‌ముఖులు సైతం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మార‌నున్నారు. విజేత‌గా నిలిచే జ‌ట్టుకు స్వ‌యంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కప్ ను బ‌హూక‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ లో ర‌జ‌త్ పాటిదార్ సార‌థ్యంలోన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ త‌ల‌ప‌డ‌నున్నాయి. క్వాలిఫ‌య‌ర్ -1లో పంజాబ్ ను ఓడించి నేరుగా ఫైన‌ల్ కు చేరుకుంది ఆర్సీబీ. విచిత్రం ఏమిటంటే క్వాలిఫ‌య‌ర్ -2లో బ‌ల‌మైన ముంబైని ఓడించి మ‌రోసారి త‌ల‌ప‌డేందుకు సిద్ద‌మైంది పంజాబ్.

ఫైన‌ల్ మ్యాచ్ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న అలియాస్ ఎస్ఎస్ రాజ‌మౌళి. తాను ఫైన‌ల్ మ్యాచ్ చూసేందు కోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశాడు. ఆయ‌న చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. త‌ను మ‌హేష్ బాబుతో మూవీ షూటింగ్ బిజీగా ఉన్నాడు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com