SSMB29 : రిలీజ్ కాకుండానే రికార్డుల మోత మోగిస్తున్న ఏకైక సినిమా ఎస్ఎస్ఎంబీ29. ఈ చిత్రం గురించి కీలక అప్ డేట్స్ ఎప్పటికప్పుడు వస్తున్నాయి. ఫ్యాన్స్ ను మరింత ఉత్కంఠ భరితంగా మార్చేలా చేస్తున్నాయి. అందుకే భారతీయ సినీ రంగంలో ఇతర దర్శకుల కంటే దర్శకేంద్రుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) డిఫరెంట్. రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ కౌబాయ్ నేపథ్యంతో రాసిన కథనే ఈ చిత్రం. ఇందులో స్టార్ హీరో మహేష్ బాబు కీ రోల్ పోషిస్తున్నాడు. మరో పాత్రలో హాలీవుడ్ , బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది.
Mahesh Babu-SSMB29
ఎస్ఎస్ఎంబీ 29(SSMB29) షూటింగ్ శర వేగంగా జరుపుకుంటోంది. అయితే జక్కన్న మూవీ అంటేనే లాంగ్ గ్యాప్ ఇస్తాడు. సీన్ టు సీన్ కోసం. తను వంద శాతం వచ్చేంత దాకా నిద్రపోడు. ఇది తన నైజం. అందుకే జక్కన్నతో నటించాలంటే నటీ నటులు, సాంకేతిక నిపుణులు జడుసుకుంటారు. అంతే కాదు కొంచెం ఇబ్బంది పడతారు. అయినా ఆయన సినిమాలో ఒక్క పాత్ర దొరికినా చాలు అనుకునే వాళ్లు ఎందరో ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్ డేట్ వచ్చింది.
ఇటీవలే సమ్మర్ వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చేశాడు ప్రిన్స్ మహేష్ బాబు. ఈ ఇద్దరూ కలిసి ప్రస్తుతం వారణాసిలో ప్రత్యక్షం అయ్యారు. దీనికి కారణం ఎస్ఎస్ఎంబీ29 మూవీలో సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇదే సమయంలో టాలీవుడ్ కు చెందిన పలు సినిమాలలో వారణాసి తప్పకుండా ఉండేలా చూసుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. మరో షెడ్యూల్ కోసం రెడీ అయ్యాడు జక్కన్న. వారణాసిలో కీలక సన్నివేశాలకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తంగా రిలీజ్ కాకుండానే రికార్డుల మోత మోగిస్తోంది జక్కన్న, ప్రిన్స్ కాంబినేషన్.
Also Read : Hero Ajith Kumar : దళపతి నిర్ణయం సాహసోపేతం