దర్శక ధీరుడు జక్కన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది గనుక. తను ఏది చేసినా సంచలనమే. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న దర్శకుడు. ప్రస్తుతం మహేష్ బాబుతో హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీస్తున్నాడు ఎస్ఎస్ఎంబీ29 పేరుతో. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇందుకు సంబంధించి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండడంతో భారీగా అంచనాలు మొదలయ్యాయి. తను సినిమా తీయాలంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటి వరకు ఎవరు నటిస్తున్నారనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు రాజమౌళి.
ప్రస్తుతానికి మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ , హాలీవుడ్ సుందరి ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు మాత్రమే బయటకు వచ్చింది సమాచారం. రాజమౌళి తన సినిమా గురించిన అప్ డేట్స్ ఎలాంటివి పంచుకోడు. ఏ ఒక్కరు కూడా దీని గురించి బయటకు చెప్పకుండా ఉండేందుకు ఓ అగ్రిమెంట్ కూడా చేసుకుంటాడు. దీంతో ఏ ఒక్కరు బయటకు రారు. నోరు విప్పరు.
ఇక ఎస్ఎస్ఎంబీ29 విషయానికి వస్తే మొదటి షెడ్యూల్ పూర్తయింది. 2వ షెడ్యూల్ కూడా పూర్తయ్యే దశలో ఉంది. తాజాగా రూ. 50 కోట్ల భారీ ఖర్చుతో ఏకంగా వారణాసి సెట్ ను హైదరాబాద్ లో నిర్మించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను హల్ చల్ చేస్తున్నాయి. రాజమౌళి ఏది చేసినా అది క్షణాల్లో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే రూ. 2000 కోట్లకు సంబంధించి మార్కెట్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా జక్కన్నా మజాకా అంటున్నారు ఫ్యాన్స్, సినీ వర్గాలు.