సినిమా ఇండస్ట్రీలో చాలా పద్దతి కలిగిన నటిగా గుర్తింపు పొందారు సుహాసిని. తెలుగు, తమిళ సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉన్నారు. మంచి నటి అంటూ పేరు పొందారు. కొంత కాలం పాటు తను ఒక వెలుగు వెలిగారు. అలనాడు టాప్ హీరోలందరితో నటించారు. ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో జత కట్టారు. పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతానికి హ్యాపీగా గడుపుతున్నారు. కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగొందిన సుహాసిని ఇప్పుడు క్యారెక్టర్ పాత్రలకు మాత్రమే ఓకే చెబుతోంది. తాజాగా తను ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తన భర్త దర్శకుడు మణిరత్నం గురించి. ఈ విషయాన్ని తన వేదిక మీద పంచుకుంది. తన చిన్నాన్న ఇలయ నాయగన్ కమల్ హాసన్ , త్రిష కృష్ణన్, సిలాంబరసన్ కలిసి నటించిన చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమానికి సుహాసిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తనకు ముందుగా మణిరత్నం అనే వ్యక్తి ఎవరో తెలియదన్నారు. పెళ్లి చేసుకోకంటే ముందు. తాను లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన చిత్రం నాయకన్ (నాయకుడు) చూశానని , ఆ తర్వాత బాగుందంటూ ఫోన్ చేశానని చెప్పింది. ఆ తర్వాత తామిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందన్నారు. చివరకు వివాహంతో ఒక్కటయ్యామని పేర్కొంది సుహాసిని.