Sunil Gavaskar : ముంబై – భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఐపీఎల్ 2025 టోర్నీ గురించి స్పందించాడు. ప్రస్తుతం మెగా టోర్నీ చివరి దశలో ఉందన్నాడు. ప్రస్తుతం ఇంకా యుద్దం ముగియ లేదని, భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉందన్నాడు. ఈ విపత్కర సమయంలో టోర్నీ సందర్బంగా మిగిలి పోయిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లకు సంబంధించి డీజేలు, డ్యాన్సింగ్ గర్ల్స్ వద్దని సూచించాడు. దీని వల్ల స్పూర్తి దెబ్బ తింటుందని పేర్కొన్నాడు సునీల్ గవాస్కర్.
Sunil Gavaskar Shocking Comments
ఈ క్లిష్టమైన సమయంలో క్రికెటర్లు, బీసీసీఐ భారత ప్రభుత్వానికి , ముఖ్యంగా పాకిస్తాన్ తో పోరాడుతున్న సాయుధ త్రివిధ దళాలకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నాడు. ఆట తప్ప ఇంకే వినోదం అనేది స్టేడియంలో ఉండ కూడదని స్పష్టం చేశాడు. దీని వల్ల మన స్పూర్తి దెబ్బ తినే ప్రమాదం లేక పోలేదన్నాడు సన్నీ. ఇప్పటి వరకు లీగ్ లో 60 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఈ సమయంలో ఈ కీలక లీగ్ మ్యాచ్ లను కేవలం దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి నివాళిగా మాత్రమే చూడాలని సూచించాడు గవాస్కర్(Sunil Gavaskar). ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుండడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ను రీ స్టార్ట్ చేస్తామని, జూన్ 3న ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరుగుతుందని తెలిపారు బీసీసీఐ కార్యదర్శి జే షా.
Also Read : SA Cricket Board Shocking :టాటా ఐపీఎల్ కు సౌతాఫ్రికా బోర్డు షాక్