సూర్య కుమార్ యాద‌వ్ సూప‌ర్ షో

7 ఫోర్లు 4 సిక్స్ లు 73 ర‌న్స్

ముంబై – ఐపీఎల్ 2025 టోర్నీ ప్రారంభంలో నాలుగు మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలై ఆ త‌ర్వాత అనూహ్యంగా పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది ముంబై ఇండియ‌న్స్. హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ఈ జ‌ట్టు అనుకోకుండా స‌మిష్టి ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. ఈ త‌రుణంలో ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే డూ ఆర్ డై పొజిష‌న్ లో ఉన్న ముంబై ఇండియ‌న్స్ ఎక్క‌డా త‌గ్గ లేదు. ఆదిలోనే ప‌రుగులు చేసేందుకు తంటాలు ప‌డింది.

కానీ ఆ స‌మ‌యంలో మైదానంలో ఉన్న స్టార్ ప్లేయ‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ సూప‌ర్ షో చేశాడు. మ‌రోసారి త‌న జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఏకంగా ఆఖ‌రు 2 ఓవ‌ర్ల‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించాడు. దీంతో ముంబై ఇండియ‌న్స్ కు తిల‌క్ వ‌ర్మ‌, సూర్య క‌లిసి 48 ప‌రుగులు పిండుకున్నారు. భారీ భాగ‌స్వామ్యాన్ని ఏర్పాటు చేశాడు. దీంతో సూర్య భాయ్ 73 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 180 ర‌న్స్ చేసింది ముంబై.

అనంత‌రం 181 ర‌న్స్ తో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు కేవ‌లం 18.2 లో 121 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది ముంబై బౌలర్లు శాంట్న‌ర్ 11 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే బుమ్రా 12 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మొత్తంగా 59 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది ఢిల్లీ క్యాపిట‌ల్స్. మొత్తంగా ఈ మ్యాచ్ సూర్య కుమార్ యాద‌వ్ ది అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com