ఎంఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. దీనిని పాన్ ఇండియా లెవల్లో తీశామని ప్రకటించాడు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు లవ్లీ బ్యూటీ నిధి అగర్వాల్ కీ రోల్ పోషించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు స్పందన లభించింది. తాజాగా మరో పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్.
ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. పవన్ కళ్యాణ్ స్వయంగా పాట పాడాడు. దీని కోసం ఫ్యాన్స్ ఎదురు చూశారు. వారంతా హ్యాపీగా ఫీలయ్యారు. తాజాగా రిలీజైన సాంగ్ తార తార అంతగా ఆకట్టుకోలేదని చెప్పక తప్పదు. ఆస్కార్ అవార్డు గ్రహీత అందించిన మ్యూజిక్ లా లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏదైనా పాట చేసేటప్పుడు సినిమాలో ఎవరు నటిస్తున్నారనే దానిపై అంచనా లేకుండానే మ్యూజిక్ అందిస్తే ఎలా అని మండిపడుతున్నారు. లోలోపట రగిలి పోతున్నాయి.
ఇక హరి హర వీరమల్లు మూవీని జూన్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్. దీంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమాకు రిలీజ్ కాక ముందే కష్టాలు మొదలయ్యాయి. అటు ఏపీలో ఇటు తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తమ టాకీస్ లను జూన్ 1 నుంచి బంద్ చేస్తామని ప్రకటించారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగారు పవన్ కళ్యాణ్. స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో వారంతా దిగి వచ్చారు. నిర్మాతలు సైతం కీలక ప్రకటన చేశారు. తన మూవీకి చివరకు లైన్ క్లియర్ అయ్యింది.
తాజాగా విడుదల చేసిన పాటను శ్రీ హర్ష ఈమెని రాయగా లిప్సిక భాష్యం, ఆదిత్య అయ్యంగార్ పాడారు.