తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ప్రకటించిన మేరకు తాము జూన్ 1 నుండి థియేటర్లను మూసి వేయడం లేదని స్పష్టం చేసింది . హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని వాటాదారుల సమావేశం జరిగింది. టాకీసుల నిర్వహణ రోజు రోజుకు భారంగా మారిందని పేర్కొంది. నెలకు అన్ని ఖర్చులకు గాను రూ. 5 లక్షలకు పైగా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు. పలువురు తమ ఆందోళనను వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే జూన్ 12 నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ కలిసి నటించిన హరి హర వీరమల్లు చిత్రం విడుదల కానుంది. ఒకవేళ థియేటర్లు మూసుకుంటే దాని పరిస్థితి ఏమిటనే ఆదోళన అంతటా నెలకొంది. ఈ సమయంలో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య చోటు చేసుకున్న చర్చల మేరకు థియేటర్లను మూసి ఉంచబోమంటూ ప్రకటించారు. పవన్ , సినీ ప్రేమికులకు తీపి కబురు చెప్పారు.
ఇదిలా ఉండగా థియేటర్లలో సినిమా ప్రదర్శనల సందర్బంగా వచ్చే వసూళ్ల ఆధారంగా ఆదాయ భాగస్వామ్య వ్యవస్థను అమలు చేయాలని ప్రదర్శకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కీలక సమావేశంలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు పాల్గొన్నారు. కాగా మూసివేతకు సంబంధించి ఎలాంటి నిర్ణయం ఇంత వరకు తీసుకోలేదని పేర్కొన్నారు.