బాధిత కుటుంబాల‌కు రూ. కోటి ప‌రిహారం

ప్ర‌క‌టించిన టాటా గ్రూప్ చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్

ముంబై – టాటా గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌రన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. నిన్న అహ్మ‌దాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలి పోయింది. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండ‌గా విమానంలో ఉన్న‌ 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ ఏడాదిలో జ‌రిగిన అతిపెద్ద మాన‌వ విషాదం చోటు చేసుకుంది. కాగా ఈ దుర్ఘ‌ట‌నలో ప్రాణాలతో బయటపడ్డాడు విశ్వాస్ అనే ప్రయాణికుడు. ఇదే స‌మ‌యంలో విమానం బీజే మెడికల్ కాలేజీపై పడడంతో మరో 24 మంది మృతి చెందారు.

మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా ఉన్నారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు ఇవాళ జ‌రుగుతున్నాయి. ఇక మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, 7 మంది పోర్చుగీస్, ఒక్కరు కెనడా వాసి ఉన్నారు. ఈ సంద‌ర్బంగా విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించారు టాటా గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. వైద్య ఖ‌ర్చులు భ‌రిస్తామ‌ని, అంతే కాకుండా మెడిక‌ల్ కాలేజీ భ‌వ‌న పున‌ర్ నిర్మాణం కోసం స‌పోర్ట్ చేస్తామ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా శుక్ర‌వారం అహ్మ‌దాబాద్ కు చేరుకున్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఘ‌ట‌నా స్థ‌లాన్ని పీఎం సంద‌ర్శించారు. పీఎం ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సీఎం ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com