అమరావతి – ఆంధ్రలో ఎన్డీఏ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకోనుంది జూన్ 12న గురువారం. పెద్ద ఎత్తున ఉత్సవాలు, సంబురాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. గత సంవత్సరంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రదర్శించడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగ పడుతుందని స్పష్టం చేశారు. సుపరిపాల – స్వర్ణ ఆంధ్ర పేరుతో ఇది తన విజయాలను ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన ఎన్డీఏ కూటమి ఏడాది క్రితం అధికారంలోకి వచ్చి 164 అసెంబ్లీ స్థానాలతో అఖండ విజయం సాధించింది. ఆనాడు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీని కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం 5 గంటలకు అమరావతిలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటామని ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ వెల్లడించారు.
2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12, 2025న తన మొదటి సంవత్సర పాలనను పూర్తి చేసుకుంది, ఇది ప్రజల తీర్పుతో నడిచే ఒక సంవత్సరం పాలన ముగింపును సూచిస్తున్న మైలురాయి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం గత సంవత్సరంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రదర్శించడానికి, రాబోయే నాలుగు సంవత్సరాలకు దాని దార్శనికత, వ్యూహాత్మక లక్ష్యాన్ని తెలియ జేయడానికి ఒక వేదికగా ఉపయోగ పడుతుంది.